English | Telugu

సరైనోడు ఫస్ట్ హాఫ్ రివ్యూ..!

బన్నీ బోయపాటి క్రేజీ కాంబినేషన్లో, భారీ అంచనాల మధ్య ఈరోజే రిలీజైంది సరైనోడు మూవీ. ఇప్పటికే రెండు మెగా సినిమాలు దెబ్బ తినడంతో, మెగాఫ్యాన్స్ ఆశలన్నీ సరైనోడి మీదే ఉన్నాయి. ప్రస్తుతానికి మూవీ ఫస్ట్ హాఫ్ థియేటర్ రిపోర్ట్ వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ముఖ్యంగా అల్లు అర్జున్ ను బోయపాటి తెరమీద ఆవిష్కరించిన తీరు అద్భుతమంటున్నారు. ఫైటింగ్ సీక్వెన్సెస్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తాయట. ముందే అనుకున్నట్టుగా క్యాథరీన్ ట్రెసా ఎమ్మెల్యేగా చేసింది. శ్రీకాంత్ బన్నీకి మావయ్యగా చేశాడు. సినిమాకు మరో హైలెట్ విలన్ పాత్ర. తమిళంలో ఇప్పటికే హీరోగా సక్సెస్ అయిన ఆది పినిశెట్టి, సరైనోడులో స్టైలిష్ విలన్ గా అదరగొట్టేశాడు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని కామ్ అండ్ కూల్ విలన్ గా, బన్నీ పాత్రకంటే ఒక అడుగు ముందే ఈ పాత్ర ఉంటుంది.

ఫస్టాఫ్ లో వచ్చే సాంగ్స్ డ్యాన్సుల్లో ఎమ్మెల్యే సాంగ్ కు కొరియోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. అతిలోక సుందరి, యు ఆర్ మై ఎమ్మెల్యే, ప్రైవేట్ పార్టీ సాంగ్స్ మూడూ ఫస్టాఫ్ లో వస్తాయి. ప్రైవేట్ పార్టీ సాంగ్ లో క్యాథరీన్ అందాలతో ఆకట్టుకుంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం భారీ ఫైట్ తో డిజైన్ చేశాడు బోయపాటి. బన్నీ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ను ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఇచ్చాడంటున్నారు. ఫస్టాఫ్ లో కామెడీ పెద్ద కనిపించదు కానీ బన్నీ పెర్ఫామెన్స్, క్యాథరీన్ అందాలు, ఫైట్స్ ఆడియన్స్ ను సినిమాలో ఇన్వాల్వ్ చేసేస్తాయి. ఇక్కడి వరకూ ఫస్టాఫ్ రిపోర్ట్ అండ్ రివ్యూ. మూవీ కంప్లీట్ రివ్యూ కాసేపట్లో...

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.