English | Telugu

దేవిని తొక్కెస్తున్న చిరంజీవి, బాలకృష్ణ..!

దేవిశ్రీప్రసాద్..డీఎస్పీ పేరు ఎదైనా సంగీత ప్రపంచంలో ఆ పేరు ఒక సంచలనం. వరుస మ్యూజికల్ హిట్స్‌తో అభిమానుల చేత స్టెప్పులు వేయించాడు దేవి. మనోడి టాలెంట్ తమిళ తంభిలకు నచ్చడంతో అక్కడ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి..టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒకేసారి బ్యాండ్ బజాయించాడు. అయితే అర్నెల్ల కిందట కుమారి 21 ఎఫ్ సక్సెస్ మీట్‌లో ఉన్నట్లుండి దేవిశ్రీ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని బాంబు పేల్చాడు నిర్మాత దిల్‌రాజు. సుకుమార్ దర్శకత్వంలో తన బేనర్లోనే దేవిని హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత సుక్కు..దేవి కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది ఈ వార్త కనుమరుగైపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.

మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకున్న కమిట్మెంట్ల వల్లే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు దేవి. చిరంజీవి 150వ సినిమాతో పాటు బాలయ్య వందో సినిమాకు కూడా తానే పనిచేయాల్సి ఉందని..రెండు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌లపైనే ఫుల్ ఫోకస్ పెట్టడంతో తనకు వాటితోనే టైం గడిచిపోతుందని. ఈ రెండు సినిమాల పని పూర్తయ్యాకా హీరోగా తన అరంగేట్రం గురించి ఆలోచిస్తానన్నాడు. ఈ పరిణామాలన్నింటితో దేవిని తెర వెనుక నుంచి తెర ముందు చూడాలనుకుంటున్న అభిమానులు నిరాశలో పడిపోయారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.