English | Telugu

పవన్‌ కళ్యాణ్‌కి జాతకం చెప్పిన రాంగోపాల్ వర్మ !

రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ తన మనసులో ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా చెప్తారు. తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తూ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తారు. ఇవాళ విడుదలైన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో తాను చెప్పిందే నిజమైందన్నారు వర్మ. హిందీలో సర్దార్ ఓపెనింగ్స్ 2 శాతమేనని, నెల రోజుల క్రితం తాను ఊహించిందే జరిగిందని ట్వీట్ చేశారు.

ఈ సినిమాను హిందీలో విడుదల చేయడం పెద్ద పొరపాటు అని వర్మ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో పవన్ కంటే ప్రభాస్ పెద్ద హీరోగా గుర్తింపు పొందుతాడని అన్నారు. బాహుబలికి మించిన సినిమాతో హిందీలోకి వెళితే బాగుంటుందన్నారు. అందరికంటే పవన్‌ బాగుండాలని కోరుకునే వ్యక్తిని తానే అని ఆయన్ని గౌరవించే అభిమానిగా సలహా ఇస్తున్నానని చెప్పారు. పబ్లిసిటీ చేయడంలోనూ..సినిమాను రిలీజ్‌ చేయడంలోనూ వర్మ స్టైలే వేరు. ఆ ఎక్స్‌పిరియన్స్‌తోనే వర్మ పవన్ అండ్ కోను హెచ్చరించారు. చివరికి ఆయన చెప్పిన జోస్యమే ఫలించి హిందీలో సర్దార్‌కు ఆడియాన్సే కరువయ్యారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.