English | Telugu

ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు స‌ర్దార్‌??

ఎన్న‌డూ లేని విధంగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకి వీలైనంత హైప్ క్రియేట్ చేయాల‌ని భావిస్తోంది చిత్ర‌బృందం. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ విష‌యంలో ఆప‌సోపాలు ప‌డిపోతున్నారు. ఆఖ‌రికి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఓ చేయి వేస్తున్నాడు. ఎప్పుడూ ప‌బ్లిసిటీ ఆడంబ‌రాల‌కు దూరంగా ఉండే వ‌వ‌న్ క‌ల్యాణ్‌... త‌న ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా స‌ర్దార్ కోసం కొన్ని త్యాగాలు చేస్తున్నాడ‌ని, త‌న సినిమాకి వీలైనంత ప‌బ్లిసిటీ క‌ల్పించ‌డానికి తెగ ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా... సర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని హిందీలో ఈరోస్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంస్థ రూ.12 కోట్ల‌కు కొనుగోలు చేసింద‌న్న‌ది టాక్‌. నిజంగా ఇది టాలీవుడ్‌కి దిమ్మ‌తిరిగే న్యూసే. ప‌వ‌న్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందాల‌కు అవ‌ధుల్లేని వార్త‌. అయితే.. ఈ న్యూస్ కూడా కేవ‌లం హైప్ క్రియేట్ చేయ‌డానికి వ‌దిలింద‌ని టాక్‌.

ఈరోస్‌, శర‌త్ మ‌రార్‌, ప‌వ‌న్ ఈ ముగ్గురూ క‌ల‌సి స‌ర్దార్ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ముగ్గురు నిర్మాత‌ల‌న్న‌మాట‌. హిందీ వెర్ష‌న్‌ని ప్ర‌త్యేకంగా అమ్మ‌లేదు. ఈరోస్ త‌న పేరుమీద ఈ సినిమాని హిందీలో విడుద‌ల చేస్తోంది. ఆ మాత్రం దానికే రూ.12 కోట్ల‌కు అమ్మేశాం అని చెప్పి స‌ర్దార్ టీమ్ హైప్ క్రియేట్ చేయాల‌ని చూస్తోంది. డిస్ట్రిబ్యూట‌ర్ మ‌నోడే అయిన‌ప్పుడు ఎంత‌కిస్తే ఏంటి? ఆ డ‌బ్బుల‌న్నీ అంకెల్లోనే త‌ప్ప‌.. క్యాష్ రూపంలో క‌నిపించ‌దు. ప‌వ‌న్ హిందీ సినిమాకి ఇంత బిజినెస్ జ‌రిగిందా? అని మిగిలిన‌వాళ్లు అనుకోవాల‌ని, దాంతో హైప్ వ‌చ్చేస్తుంద‌ని ఇంత స్కెచ్ వేస్తోంది చిత్ర‌బృందం. ప‌వ‌న్ సినిమాకి ఇలాంటి ప్లానింగులు స్కెచ్చింగులు అవ‌స‌రంలేదు. ప‌వ‌న్ బొమ్మ క‌నిపిస్తే చాలు. క్రేజ్ ఆటోమెటిగ్గా త‌న్నుకొని వ‌చ్చేస్తుంది. అలాంట‌ప్పుడు ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు స‌ర్దార్‌??

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.