English | Telugu

బాహుబ‌లిని టార్గెట్ చేసిన‌ స‌ర్దార్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టి ఇప్పుడు బాహుబ‌లి సినిమాపై ప‌డిందా?? ఆ సినిమాని బ్రేక్ చేయాల‌న్న ఉద్దేశంతోనే స‌ర్దార్ - గ‌బ్బ‌ర్‌సింగ్ తీస్తున్నాడా?? ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం ప‌వ‌న్ టార్గెట్... బాహుబ‌లి సినిమానే అంటున్నాయి. బాహుబ‌లి- స‌ర్దార్ రెండింటిమ‌ధ్య ఎలాంటి పోలిక‌లూ లేవు. కానీ.. మార్కెట్ స్ట్రాట‌జీ విష‌యంలో ప‌బ్లిసిటీ విష‌యంలో బాహుబ‌లిని ఫాలో అయిపోతే బెట‌ర్ అన్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌. అందుకే.. ఇంట్రవెల్ ముందొచ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌ని భారీ లెవిల్లో ప్లాన్ చేశాడు ప‌వ‌న్‌. ఈ ఫైటు కోసం వంద గుర్రాల్ని తీసుకొచ్చారు. ఖ‌రీదైన కార్లు వాడుతున్నారు.మొత్తానికి ఈ ఒక్క ఫైటుకే రూ.3.5 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు టాక్‌. ఇంతకు ముందు ప‌బ్లిసిటీ గురించి బొత్తిగా ప‌ట్టించుకోని ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఈ సినిమా విష‌యంలో మాత్రం మిన‌హాయింపు ఇచ్చాడ‌ట‌.

ఎక్ప్‌క్లూజీవ్ ఇంట‌ర్వ్యూలు ఏర్పాటు చేయాల‌ని, షూటింగ్‌కి సంబంధించిన విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు లీక్ చేయాల‌ని ప‌వ‌న్ సూచించాడ‌ట‌. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.75 కోట్ల వ‌ర‌కూ ఉండొచ్చ‌ని ఓ అంచ‌నా. బాహుబ‌లి త‌ర‌వాత ఇంత మొత్తం బిజినెస్ చేసిన సినిమా ఇదే. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా నిల‌బ‌డితే. దాదాపు రూ.150 కోట్లు రాబ‌ట్టొచ్చ‌ని... క‌నీసం శ్రీ‌మంతుడు సినిమాని దాటేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. అందుకే... ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా వెనుకంజ వేయ‌డం లేదు. ఆడియో ఫంక్ష‌న్ కూడా భారీ ఎత్తున నిర్వ‌హించి ప‌బ్లిసిటీని ముమ్మ‌రం చేయాల‌ని స్కెచ్ వేసింది స‌ర్దార్ టీమ్. మ‌రి ఈ ఆశ‌లు ఏ మేరకు నెర‌వేర‌తాయో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.