English | Telugu

స‌ర్దార్ గబ్బర్ సింగ్‌..ఓ కిచిడీ సినిమానా?

వంట‌గాళ్లు ఎక్కువైతే వంట‌కం నాశ‌నం అవుతుంద‌ని చెప్తుంటారు పెద్ద‌లు. సినిమా కూడా అంతే. వేలు పెట్టి కెలికేవాళ్లు ఎక్కువ మంది ఉంటే ఆ సినిమా ఇక చూసిన‌ట్టే. ప్ర‌స్తుతం స‌ర్దార్ గ‌బ్బర్ సింగ్ ప‌రిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండ‌ద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలే ఉన్నాయి. అంచ‌నాల‌తో పాటు కొన్ని అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి. ఈ సినిమా స‌రిగ్గానే వ‌చ్చిందా? నిజంగానే క‌థ‌లో, సినిమాలో అంత ద‌మ్ముందా? అంటూ.. పంపిణీదారులు, కొంత‌మంది ప‌వ‌న్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం గాభ‌రా ప‌డిపోతున్నారు. దానికీ కార‌ణాలున్నాయి.

ఈ సినిమాని ముందు నుంచీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌సింగిల్ హ్యాండెడ్‌తో న‌డిపిస్తున్నాడు. ఆయ‌నే తెర వెనుక ద‌ర్శ‌కుడ‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. బాబి ఉన్నాడు కాబ‌ట్టి.. ఆయ‌నా అప్పుడ‌ప్పుడూ ఓ చేయి వేస్తున్నాడు. ఈలోగా ప‌వ‌న్ హ‌రీష్ పాయ్ అనే త‌న స్నేహితుడ్ని రంగంలోకి దించాడు. హ‌రీష్ ఓ డాన్స్ మాస్ట‌ర్.. ప‌వ‌న్‌కి బాగా స‌న్నిహితుడు. ప‌వ‌న్ సినిమాల్లో చాలా మ‌ట్టుకు ఆయ‌నే డాన్స్ కంపోజర్‌. స‌ర్దార్ సినిమాకి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ కూడా ఆయ‌నే. హ‌రీష్ పై ఉన్న న‌మ్మకంతో ఓయూనిట్ ద‌ర్శక‌త్వ బాధ్య‌త‌లు హ‌రీష్‌కి అప్ప‌గించాడు ప‌వ‌న్‌. అంటే అక్క‌డికి ముగ్గురు ద‌ర్శ‌కుల‌య్యార‌న్న‌మాట‌. క‌థ అక్క‌డితే ఆగిపోలేదు. ఆండ్రూని అద‌న‌పు కెమెరామెన్ గా నియ‌మించుకొన్న ప‌వ‌న్‌.. అత‌నికీ డైరెక్ష‌న్ ఛాన్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. కొన్ని స‌న్నివేశాల్ని ఆండ్రూనే టేక‌ప్ చేశాడ‌ని టాక్‌. అంతేకాదు.. రామ్ ల‌క్ష్మ‌ణ్‌లూ ఓ చేయి వేశార‌ట‌. యాక్ష‌న్ స‌న్నివేశాల‌నే కాకుండా హీరో బిల్డ‌ప్ సీన్స్ కూడా వారి ఆధ్వ‌ర్యంలోనే తీశార‌ని స‌మాచారం. అంటే.. ఈ సినిమాకి ఆరుగురు ద‌ర్శ‌కుల‌న్న‌మాట‌. ఇంత‌మంది చేయి చేసుకొన్న స‌ర్దార్ కిచిడీలా తయార‌వుతుందేమో అన్న‌ది సినీ జ‌నాల భ‌యం. ప్ర‌తీ ఎపిసోడ్‌కీ ద‌ర్శ‌కుడు మారిపోతే.. ఇక ఆ సినిమాలో కంటిన్యుటీ ఏముంటుంది?? మొత్తానికి ఇలాంటి అనుమానాలు స‌ర్దార్ చుట్టూ చేరి తెగ కంగారు ప‌డుతున్నాయి. ఇవ‌న్నీ కేవ‌లం అనుమానాలో, నిజాలో తెలియాలంటే స‌ర్దార్‌కి తెర లేవాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కూ మ‌నం ఎదురుచూడాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.