English | Telugu

ఐశ్వర్యారాయ్ సరబ్ జిత్ : ట్రైలర్ రివ్యూ

బాలీవుడ్ లో బయోపిక్స్ చితగ్గొట్టేస్తున్నారు. బయోపిక్స్ తీయడమనేది మామూలు విషయం కాదు. వాటిలో ఎన్నో అడ్డంకులుంటాయి. వాటన్నింటినీ దాటుకుని ఎక్స్ ట్రార్డినరీగా సినిమాల్ని రూపొందిస్తున్నారు. నిన్న మొన్నొచ్చిన నీర్జా, కలెక్షన్లు కుమ్మేసుకుంది. అంతకుముందు భాగ్ మిల్కా భాగ్, మేరీ కోమ్ సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసల్ని పొందాయి. ఇప్పుడు లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ సరబ్ జిత్. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

పాకిస్థాన్ కు చిక్కిన సరబ్ జిత్ అనే ఒక భారతీయ రైతును అక్కడెన్ని చిత్రహింసలు పెట్టారో తెలియని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అతనికి కనీసం సరైన తిండి, బట్ట సదుపాయం కూడా కల్పించకుండా, మనిషి పూర్తిగా పడుకోలేనంత చిన్న చీకటి గదిలో దాదాపు 20 ఏళ్ల పాటు నిర్బంధించింది పాక్. సరబ్ జిత్ ఏమైపోయాడో తెలియని అతని సోదరి దల్బీర్ కౌర్ అతని కోసం వెతికి వెతికి చివరకు పాకిస్థాన్ జైల్లో ఉన్నాడని తెలుసుకుంటుంది. అతన్ని విడిపించడానికి ఆమె పడే యాతన, ఆమె మనసు పడే వేదనే సరబ్ జిత్ సినిమా సారాంశం. ఇక్కడ కసబ్ ను ఉరితీసినందుకు ప్రతీకారంగా, సరబ్ జిత్ ను కూడా పాక్ చంపేసింది. సినిమాలో ఇదే చూపించబోతున్నారా లేక సరబ్ జిత్ పాత్రను బయటికి తీసుకొస్తారా అన్నది ఆసక్తికరం. దల్బీర్ పాత్రలో ఐశ్వర్య ఒదిగిపోయింది. ఇక సరబ్ జిత్ పాత్రను జీవించడం కోసం బక్కచిక్కిపోయి సగమైపోయాడు రణ్ దీప్ హుడా. మేరీకోమ్ తీసిన ఒమంగ్ కుమార్, సరబ్ జిత్ ను డైరెక్ట్ చేశాడు. మే 20 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ అయితే టాప్ నాచ్ గా ఉంది. సినిమా కూడా ఇదే టెంపో మెయింటెయిన్ చేస్తే, బాలీవుడ్ లో మరో బయోపిక్ సూపర్ హిట్ ఖాయం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.