English | Telugu

సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపు

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిన విషయం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 16న ముంబై పోలీస్ కంట్రోల్ రూం కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. త్వరలోనే సల్మాన్ ను చంపేయబోతున్నామంటూ, ఒక అజ్ఞాత వ్యక్తి హెచ్చరించాడు. మొదట దీన్ని ఆకతాయి పనిగా అనుకున్న పోలీసులు, తర్వాత సీరియస్ అయి దర్యాప్తు మొదలెట్టారు.

కాల్ ట్రేస్ చేస్తే, ముంబైలోని మెరైన్ డ్రైవ్ లో ఉన్న ఒక పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ వచ్చిందని కనిపెట్టారు. ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం ఖచ్చితంగా తేలలేదు. ఇదే విషయమై పోలీసులు సల్మాన్ ను ప్రశ్నించగా, తనకెలాంటి ఫోన్లూ రాలేదని తెలిపాడు. ఎవరో తాగిన మైకంలో ఫోన్ చేసి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకుని తీరతామంటున్నారు ముంబై పోలీసులు. సల్మాన్ ప్రస్తుతం సుల్తాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సల్మాన్ రెజ్లర్ గా కనిపించనుండటం విశేషం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.