English | Telugu

‘సలార్‌’ రిలీజ్‌ వాయిదా.. ఈ విషయంలో నిజమెంత?

టాప్‌ హీరోల సినిమాలు చాలా సందర్భాల్లో రిలీజ్‌ వాయిదా పడడం అనేది సర్వసాధారణం. చాలా మంది హీరోలకు ఆ అనుభవం ఉంది. ఇప్పుడు తాజాగా ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సలార్‌’ చిత్రం రిలీజ్‌ వాయిదా పడబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది ఆలోచిస్తే.. చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్‌ మోకాలికి ఇటీవలే ఆపరేషన్‌ జరిగింది. అది కారణం కావచ్చు అంటున్నారు. మరోపక్క ప్రశాంత్‌ నీల్‌ ఔట్‌పుట్‌ విషయంలో సంతృప్తికరంగా లేడని, అందుకే మరికొంత టైమ్‌ తీసుకొని పర్‌ఫెక్ట్‌గా వచ్చే వరకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాని సెప్టెంబర్‌ 28న కాకుండా డిసెంబర్‌లో ఒక మంచి డేట్‌ చూసి రిలీజ్‌ చెయ్యాలనుకుంటున్నారని సమాచారం. ఈ వెర్షన్‌ ఇలా ఉంటే.. మరో వెర్షన్‌లో సెప్టెంబర్‌ 6న ట్రైలర్‌ రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు, ఓవర్సీస్‌ బుకింగ్స్‌కి అంతా సిద్ధమైంది. కాబట్టి రిలీజ్‌ వాయిదా పడే ఛాన్స్‌ లేదని, ఎవరో కావాలనే ఈ రూమర్‌ని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకు ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి ‘సలార్‌’ వాయిదాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు కాబట్టి యదాతథంగా సెప్టెంబర్‌ 28నే సినిమా రిలీజ్‌ అవుతుందేమో!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.