English | Telugu

సాయి ధరమ్ తేజ్ ఆకతాయిగా మారుతున్నాడా..?

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాంచి జోరు మీదున్నాడు. సినిమాల తర్వాత సినిమాలు ఒప్పేసుకుంటూ ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సుప్రీం రిలీజ్ కు రెడీ గా ఉండగా, తిక్క కూడా పూర్తి కావచ్చింది. మరో వైపు గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు కమిట్ అయ్యాడు సాయి. రకుల్ ప్రీత్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు అయిపోయాయని, ఇక ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ రేపో మాపో మొదలెట్టెయచ్చని సినీ వర్గాలంటున్నాయి. కథ ప్రకారం హీరో పాత్ర చాలా ఆకతాయితనంతో ఉంటుందని, అందుకే సినిమాకు అదే పేరు పెట్టే ఆలోచనలో మూవీ టీం ఉన్నారట. దీంతో ఈ ఏడాది సాయి సినిమాల సంఖ్య మూడుకు పెరిగింది. వీటిలో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ పడినా, మరిన్ని అవకాశాలతో సాయి దూసుకెళ్లిపోతాడనడంలో డౌట్ లేదు. ప్రస్తుతం సాయి ఆశలన్నీ సుప్రీమ్ మీదే ఉన్నాయి. మే మొదటి వారంలో సుప్రీం రిలీజ్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.