English | Telugu

సుప్రీం రిలీజ్ డేట్ ఫైనల్ అయింది..!

మేనమామ మెగాస్టార్ కాకముందు వాడుకున్న సుప్రీం హీరో బిరుదును తీసుకుని, సుప్రీం టైటిల్ తో వస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే ట్రైలర్లతో ఆకట్టుకుని పాజిటివ్ బజ్ తో థియేటర్లలో ఎంటరవుతున్నాడు. మే మొదటి వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నామని నిర్మాత శిరీష్, దర్శకుడు అనిల్ రావిపూడి అఫీషియల్ గా ప్రకటించారు. పటాస్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత తన రెండో సినిమాగా సుప్రీం ను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు సాయి ధరమ్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావడం విశేషం. ఇంతకు ముందు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఫర్వాలేదనిపించాయి. ఈ సారి మాత్రం తమ కాంబినేషన్లో సూపర్ మిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు వీళ్లిద్దరూ. మే 6 న సూర్య 24 సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అయినా కానీ తమ సినిమా మీద నమ్మకంతో సూర్యకు పోటీగా వెళ్లాలని ఫిక్స్ అయింది సుప్రీం టీం ఫిక్స్ అయింది. దిల్ రాజు ప్రమోషన్లు సరిగ్గా ప్లాన్ చేస్తే, బాక్సాఫీస్ దగ్గర సూర్యకు కూడా సుప్రీమ్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.