English | Telugu

రుద్రమదేవికి మెగా ఓపెనింగ్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు రుద్రమదేవికి రూ.9 కోట్లకు పైగా షేర్ రావడం విశేషం. గ్రాస్ రూ.12 కోట్ల దాకా వచ్చింది. ఓవర్సీస్ - ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో కలిపితే ఇంకో రూ.3 కోట్ల దాకా షేర్ కలెక్టయి ఉండొచ్చని అంచనా. తొలి రోజు నైజాం ఏరియాలో రూ.3.5 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు అంచనా. ఇక్కడ దిల్ రాజు రూ.12 కోట్లకు ‘రుద్రమదేవి’ హక్కులు కొన్నాడు. సీడెడ్ ఏరియాలో రూ.1.55 కోట్ల షేర్ వచ్చింది. ఉత్తరాంధ్రలో రూ.67 లక్షలు వసూలయ్యాయి. గుంటూరులో ఒక్క రోజుకే రూ.కోటి రూపాయలకు పైగా షేర్ రావడం విశేషం. అక్కడ రూ.1.05 కోట్లు వచ్చాయి. తూర్పు గోదావరిలో రూ.81 లక్షలు - పశ్చిమ గోదావరిలో రూ.66 లక్షలు - నెల్లూరులో రూ.47 లక్షలు - కృష్ణాలో రూ.47 లక్షలు వసూలయ్యాయి. మొత్తం ఏపీ వరకు రూ.5.68 కోట్లు కొల్లగొట్టింది రుద్రమదేవి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే లెక్క రూ.9.18 కోట్లు తేలింది. ఓవర్సీస్ - మిగతా రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ ఎంత వసూలు చేసింది ఇంకా క్లారిటీ రాలేదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.