English | Telugu

సాయిపల్లవి సినిమా బడ్జెట్ 4000 కోట్లు.. పిచ్చోడా మంచోడా ఆ నిర్మాత 

భారతీయుల ఆరాధ్య దైవం 'శ్రీరాముడు'(Sriramudu)పై ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే మరోసారి రణబీర్ కపూర్(Ranbir Kapoor), సాయిపల్లవి(Saipallavi)లు సీతా రాములుగా 'రామాయణ'(Ramayana)తెరకెక్కుతుండగా, ప్రస్తుతం రెగ్యులర్ గా షూటింగ్ ని జరుపుకుంటుంది. 'దంగల్'(Dangal)మూవీతో ఇప్పటి వరకు భారతీయ చిత్ర సీమలో అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన దర్శకుడిగా రికార్డు సృష్టించిన 'నితీష్ తివారి'(Nitesh Tiwari)దర్శకుడు. దీంతో 'రామాయణ' పై అందరిలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రైమ్ ఫోకస్ పతాకంపై 'నమిత్ మల్హోత్రా'(Namit Malhotra)నిర్మిస్తున్నాడు.

రీసెంట్ గా నమిత్ మల్హోత్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'ప్రపంచం మొత్తం 'రాముడి' ఇతిహాసాన్నిచూడాలనే లక్ష్యంతో నాలుగువేల కోట్ల రూపాయలతో 'రామాయణ'ని నిర్మిస్తున్నాం. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంత హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ రామాయణ. కాకపోతే హాలీవుడ్ తో పోల్చుకుంటే తక్కువే. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా మా సొంతగానే నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నాం. ఏడు సంవత్సరాల క్రితమే రామాయణ పనులు ప్రారంభించాను. కోవిడ్ తర్వాత అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది నన్ను పిచ్చివాడినని అనుకున్నారు. తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికి గొప్ప ఇతిహాసమే అని నమిత్ మల్హోత్రా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం 'రామాయణ' బడ్జెట్ న్యూస్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచింది.

'రామాయణ' రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం 2026 దీపావళికి , రెండో భాగం 2027 దీపావళి కి విడుదల కానున్నాయి. ప్రపంచంలో ఉన్న అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం 'రామాయణ' కోసం వర్క్ చేస్తుంది. విజువల్ గా కూడా ఒక సరికొత్త 'వండర్' ని ప్రేక్షకులకి పరిచయం చేయనున్నారు. ఇప్పటికే సీతారాములకి సంబంధించి రిలీజైన సాయిపల్లవి, రణబీర్ లుక్ కి మంచి పేరు వచ్చింది. రావణాసురుడిగా కన్నడ సూపర్ స్టార్ 'యష్'(Yash)చేస్తుండంతో పాటు, ఒన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. దీన్ని బట్టి రామాయణ కి ఉన్న క్రేజ్ ఈ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. రాముడి పినతల్లి 'కైకేయి' గా ఒకప్పటి హీరోయిన్ 'లారాదత్తా'(Lara Dutta),'శుర్పణఖ' అనే రాక్షసిగా మరో హీరోయిన్ 'రకుల్ ప్రీత్ సింగ్'(Rakul Preet Singh) కనిపిస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి. మిగతా క్యారెక్టర్స్ లలో కూడా భారతీయ చిత్ర పరిశమ్రకి చెందిన అత్యంత ప్రతిభావంతమైన నటీనటులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.