English | Telugu

అభిమానుల్ని నిరాశపరచని రామ్ గోపాల్ వర్మ..!

వర్మ గారంటే అందరికీ అభిమానమే. ఆయన సినిమాలు చూసే వాళ్లకు, ఆయనతో సినిమాలు చేసేవాళ్లకు, మీడియాకు, ప్రజలకు..ఇలా అందరికీ అభిమానమే. గత కొన్నేళ్లుగా వర్మగారి స్టాండర్డ్ పెంచుకుంటూ పోతున్నారు. ట్వీట్స్ లోనైనా, సినిమాల్లోనైనా, ఆయన్ను దాటే వాళ్లు లేరు. సినిమాలైతే కొత్త స్టాండర్డ్ ను వర్మ గారు క్రియేట్ చేశారు. శివతో తెలుగు సినిమాలో కొత్త అధ్యయానికి తెరలేపిన వర్మ గారి టాలెంట్ అలాంటిలాంటిది కాదు. కానీ ఒక్కోసారి హెవీ టాలెంట్ కూడా భయం కలిగిస్తుంది. అందుకే తన టాలెంట్ తో థియేటర్లకు వచ్చేవాళ్లని భయపెడదామని దెయ్యం సినిమాలు కూడా చాలానే తీశారు. సినిమాలో దెయ్యాన్ని చూసి భయపడకపోయినా, ఆ సినిమాలు చూసి భయపడ్డారు తెలుగు జనాలు.

దెయ్యమో, సినిమానో..మొత్తమ్మీద భయపెట్టడంలో అయితే సక్సెస్ అయ్యారు వర్మ గారు. అందుకే ఆయన సినిమాలంటే, ఆడియన్స్ లో ఒక ఎక్స్ పెక్టేషన్స్ వచ్చేశాయి. ఏదో ఈ మధ్య అక్కడక్కడా అనుకోకుండా రక్త చరిత్ర, రౌడీ, కిల్లింగ్ వీరప్పన్ లాంటి సినిమాలు వచ్చి ఆయన రేంజ్ ను తగ్గించేసినా, ఇదేంటి వర్మగారు తన రేంజ్ సినిమాలు తీయట్లేదని జనాలు కంగారు పడినా, వర్మగారు మాత్రం తొట్రుపాటు పడలేదు. ఈ సారి నా రేంజ్ సినిమానే వస్తుంది చూడండి అని అటాక్ తో అటాక్ చేశారు. సినిమా చూసిన తర్వాత, ప్రేక్షకులందరూ, హమ్మయ్య..మనం కంగారు పడినట్లు వర్మ ఏమీ చేయలేదు, మనం ఎలాంటి సినిమా ఊహించామో, అలాంటి సినిమానే తీశాడులే అనుకుంటూ, ఆయన శైలిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ బుర్రలకు పదును పెట్టే ప్రయత్నం చేస్తూ బయటికొస్తారు. అందులో మాత్రం ఎలాంటి సందేహమూ వలదు..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.