English | Telugu

రామ్ చరణ్, వంశీ చిత్రం ఫిబ్రవరి నుండి

రామ్ చరణ్, వంశీ చిత్రం ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, దిల్ రాజు నిర్మించనున్నారు. దర్శకుడు వంశీ అంటే "లేడీస్ టైలర్‍" వంశీ అనో లేక, కృష్ణ వంశీ అనో అనుకునేరు. కాదండీ బాబు ఇతను వంశీ పైడిపల్లి. అంటే గతంలో ప్రభాస్ హీరోగా, దిల్ రాజు నిర్మించిన "మున్నా" చిత్రానికి, యన్ టి ఆర్ హీరోగా నటించిన "బృందావనం" చిత్రానికి దర్శకత్వం వహించాడు.

దర్శకుడిగా ఇది అతనికి మూడవ చిత్రం. ఈ చిత్రాన్ని 2012 ఫిబ్రవరి నెలలో ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ తేజ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో "రచ్చ" అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించే చిత్రం కూడా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రెండు చిత్రాలూ రామ్ చరణ్ వరసగా చేస్తాడని తెలిసింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.