English | Telugu

బాధతో విలవిల్లాడిపోయిన బాలీవుడ్ హీరో..!

సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లే నటులు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటివాళ్లలో రణ్ దీప్ హుడా పేరు కూడా తప్పక ఉంటుంది. సరబ్ జిత్ సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకుని, కడుపు మాడ్చుకుని బక్కచిక్కి శల్యమైపోయిన రణ్ దీప్, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా కోసం మళ్లీ బరువు పెరిగాడు. కానీ సరబ్ జిత్ కోసం అతను చేసిన డైటింగ్ తాలూకు ప్రభావం మాత్రం అతన్ని వదల్లేదు. ఆదివారం సుల్తాన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్లోనే తీవ్రమైన నొప్పితో కుప్పకూలిపోయాడు రణ్ దీప్. వెంటనే హాస్పిటల్ కు తరలించిన తర్వాత ఆయనకు ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్లో అప్పెండిసైటిస్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ముగిసిన వెంటనే రణ్ దీప్ ను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు. రెజ్లింగ్ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో రణ్ దీప్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇది కాక హుడా టైటిల్ రోల్ పోషించిన సరబ్ జిత్ విడుదలకు సిద్ధంగా ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.