English | Telugu

కబాలీ వాయిదా వేసిన రజనీకాంత్..!

గత కొన్నేళ్లుగా సూపర్ స్టార్ రజినీ ఫాం లో లేరు. ముఖ్యంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజైన కొచ్చాడయాన్, లింగా సినిమాలు భారీ అట్టర్ ఫ్లాపులుగా మారడంతో, ఆయన అభిమానులు డిజప్పాయింట్ అయిపోయారు. దీంతో వాళ్లకు ఎలాగైనా భారీ హిట్ ఇవ్వాలని, మాఫియా జానర్ లో కబాలీ మొదలెట్టారు రజనీ. ఇప్పటికే పోస్టర్లతో కబాలీ సినిమా కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అనే నమ్మకంలో రజనీ అభిమానులున్నారు. షూటింగ్ మొదలైనప్పుడు ఏప్రిల్ 2016లో రిలీజ్ చేస్తారని అనుకున్నా, తమిళనాడు జనరల్ ఎలక్షన్ల ఎఫెక్ట్ తో, మూవీని వేసవి కానుకగా ఇస్తున్నామంటూ మే నెలకు పోస్ట్ పోన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఇంకా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పూర్తవ్వని కారణంగా, జూన్ లేదా జూలై వరకూ కబాలి రిలీజ్ కాదని చెబుతున్నారు మూవీ టీం. ఈ వేసవిలోనే తమ అభిమాన రజనీ సినిమాను ఎంజాయ్ చేద్దామనుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ న్యూస్ నిరాశను కలిగించేదే. మరోవైపు సినిమాలో తన షూట్ ను కంప్లీట్ చేసేసి, రోబో 2.0 లో బిజీ అయిపోయారు రజనీ. ఈ మధ్యే లీకైన విలన్ పాత్రధారి అక్షయ్ కుమార్ స్టిల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.