English | Telugu

ర‌జ‌నీ సినిమాకి కాపీ మ‌ర‌క‌

ఈ క‌థ నాదే, ఈ టైటిల్ నాదే... అంటూ ఎవ‌రో ఒక‌రు కోర్టు మెట్లెక్క‌డం, ఆ సినిమాకి కావ‌ల్సినంత ఉచిత ప్ర‌చారం చేసిపెట్ట‌డం ఈమ‌ధ్య మామూలైపోయింది. త‌మిళ సినిమా 'క‌త్తి' విష‌యంలో ఇదే జ‌రిగింది. ఈ సినిమా క‌థ నాదే అంటూ కోర్టుకెక్కారు. ఆ విష‌యం ఇంకా న‌లుగుతూనే ఉంది. ఈలోగా సినిమా విడుద‌లై, సూప‌ర్ హిట్ అయ్యి, కోట్లు కొల్ల‌గొట్టుకొంది. ఇప్పుడు ర‌జ‌నీకాంత్ సినిమా లింగాకీ ఇదే రీతిలో కాపీ మ‌ర‌క అంటింది. ఈ సినిమా విడుదలపై స్టే కోరుతూ మధురై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రవి రత్నం అనే ఒకాయ‌న లింగా చిత్ర కథ, తాను తీసిన ‘ముల్లైవనం 999’ కథ ఒక్కటేనని పిటీష‌న్ దాఖ‌లు చేశారు. నా క‌థ కాపీ కొట్టి మ‌ళ్లీ తీయ‌డం అన్యాయం అంటూ.. వాదిస్తున్నారు.


ఈ పిటీషన్ విచారణకు స్వీకరించిన కోర్టు చిత్ర‌బృందానికి నోటీసులు పంపింది. అతి తొంద‌ర్లో వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా కోరింది. దాంతో లింగా బృందం ఇబ్బందుల్లో పడిన‌ట్టైంది. ఇదంతా పిటీషిన‌ర్లు ప్ర‌చారం కోసం చేస్తున్న‌ట్రిక్ అని, ఇలాంటి కేసులు నిలిచిన దాఖ‌లాలు లేవ‌ని చెన్నై సినీ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. కాక‌పోతే.. విడుద‌ల‌కు ముందు చిత్ర‌బృందానికి ఇది త‌ల‌నొప్పి వ్య‌వ‌హార‌మే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.