English | Telugu

అంతా ప‌వ‌న్ క‌ల్యాణే చేస్తున్నాడు

ప‌వ‌న్ ఓ సైలెంట్ సునామీ. ప‌బ్లిసిటీలు. ఫ‌లితాలు ప‌ట్టించుకోడు. తాను చేయాలనుకొన్న‌వి సైలెంట్‌గా చేసుకొంటూ వెళ్తాడు. కొత్త హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ వెనుక ఉన్న అదృశ్య శ‌క్తి ప‌వ‌న్ క‌ల్యాణే అని మెగా స‌న్నిహితులు చెబుతున్నారు. రేయ్‌తో ఎంట్రీ ఇచ్చాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఆ సినిమా ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. అయినా స‌రే, సాయి చేతిలో ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు. రెండో సినిమా పిల్లా నువ్వు లేనిజీవితం రిలీజ్ కాకుండానే మూడో సినిమా సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ప‌ట్టాలెక్కేసింది. మ‌రో మూడు సినిమాలు సాయి చేతిలో ఉన్నాయి. ఈ ప్లానింగ్‌కి, దూకుడుకు కార‌ణం ప‌వ‌న్ క‌ల్యాణే న‌ట‌. సాయిలోని టాలెంట్ గుర్తించి, త‌న‌ని ఎలాగైనా పైకి తీసుకురావాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడట‌. మ‌రోవైపు చిరంజీవి సాయిని పూర్తిగా వ‌దిలేయ‌డం కూడా.. ప‌వ‌న్‌కి న‌చ్చ‌లేద‌ట‌. అందుకే... సాయి బాధ్య‌త‌ను తాను నెత్తిమీద పెట్టుకొన్నాడ‌ట‌. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఆఫ‌ర్లు రావ‌డానికి, అవి ఆఘ‌మేఘాల మీద ప‌ట్టాలెక్కేయ‌డానికి కార‌ణం.. ప‌వ‌న్ క‌ల్యాణేన‌ట‌. ''సాయితో మీకు ఢోకా లేదు. సినిమా తేడా వ‌స్తే నేను చూసుకొంటా'' అని ప‌వ‌న్ సైతం అభ‌య‌హ‌స్త‌మిచ్చాడ‌ట‌. ప‌వ‌న్ లాంటివాడే భ‌రోసా ఇస్తే ఇక అడ్డేముంది...?? పైగా ప‌వ‌న్ ఫ్యాన్స్ అండ సాయి సినిమాల‌కు ఉంటుంద‌న్న న‌మ్మ‌కం కూడా ఉంది. సో.. సాయిధ‌ర‌మ్ కెరీర్‌కి ప‌వ‌న్ గ‌ట్టి పునాదులే వేస్తున్నాడ‌న్న‌మాట‌.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.