English | Telugu

బాలీవుడ్ అంటే రెచ్చిపోతున్నారు

లక్ష్మీ రాయ్ దీపక్ శివదాసాని దర్శకత్వంలోని ''జూలీ 2'' థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందునా ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కుతోంది. రాయ్ లక్ష్మీకి ఇదే తొలి ప పూర్తి బాలీవుడ్ సినిమా. అందుకే ఈ అమ్మడు చాలా ఎగ్జయిట్ అవుతోంది. రాయ్ లక్ష్మీ తన క్యారెక్టర్ గురించి చెబుతూ .. ఈ సినిమా ఓ చక్కని థ్రిల్లర్. ఓ పక్కింటి అమ్మాయి గా కనిపిస్తా. ఓ సాదాసీదా అమ్మాయి లీడింగ్ హీరోయిన్ గా ఎలా ఎదిగిందన్నదే కథాంశం. ప్రతి బిట్ లో గ్లామర్ కనిపిస్తుంది. ఇందులో ఎమోషన్ - డ్రామా - కామెడీ - గ్లామర్ ఇన్ని కోణాలు చూపించబోతున్నా. మొదటిసారి పూర్తి స్థాయిలో బాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నందుకు చాలా ఎగ్జయిటింగ్ ఉందని రాయ్ లక్ష్మీ చెప్పింది. అంతే కాదు.. బికినీలో మెరవబోతోందట. అందుకోసం కసరత్తులు కూడా స్టార్ట్ చేసిందట. మొత్తానికి బాలీవుడ్ అంటే బికినీలో సొగసుల్ని ఆరబోయడానికి రెడీ అయిపోతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.