English | Telugu

అఖిల్ ఆడియోకి చీఫ్ గెస్ట్ గా గబ్బర్ సింగ్

నాగార్జున తనయుడు అఖిల్ లాంఛింగ్ మూవీ...‘అఖిల్‘ ఆడియో ఫంక్షన్ కోసం అక్కినేని అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.హీరో నితిన్... నిర్మాతగా మారి నిర్మిస్తున్న అఖిల్ సినిమా ఆడియో లాంఛ్ ను ఈ నెల 20న గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. హీరోగా అక్కినేని అఖిల్ లాంఛింగ్ మూవీ కావడంతో ఆడియో ఫంక్షన్ ను ధూంధాంగా చేయాలని చూస్తున్నారు. దాంతో తన అభిమాన హీరో అయిన పవన్ కల్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా రమ్మని నితిన్ కోరాడని చెబుతున్నారు. పవన్ వస్తే...ఆడియో ఫంక్షన్ కి మాంచి కిక్ వస్తుందని భావిస్తున్న నితిన్...పవర్ స్టార్ ను రిక్వెస్ట్ చేశాడట. మరోవైపు నాగార్జున కూడా పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి ఆహ్వానించారని, దాంతో తప్పకుండా పవన్... అఖిల్ ఆడియో ఫంక్షన్ కి వస్తాడని మెగా అభిమానులు సంబరపడుతున్నారు. అయితే తన సొంత ఫ్యామిలీ హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకే హాజరుకాని పవన్ కల్యాణ్... మరి నితిన్, నాగార్జున రిక్వెస్ట్ ను మన్నించి...అఖిల్ ఆడియో ఫంక్షన్ కి వస్తాడా...లేక డుమ్మా కొడతాడో చూడాలి

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.