English | Telugu

డ్రామా నాది కాదు..వాళ్లదే-పూరి

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై దాడి వ్యవహారం చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. నిన్న మీడియా ముందుకు వచ్చిన ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తాము అసలు దాడి చేయలేదని..చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే పూరి ఆఫీసులో తాము అడుగుపెట్టలేదన్నారు. కనీసం సీసీకెమెరా ఫుటేజీ అయినా చూపించాలన్నారు. దీనిపై నిన్న సాయంత్రం మాట్లాడిన పూరి ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్‌మెయిల్ చేసి తప్పుడు లెక్కలు చూపారని వివరణ ఇచ్చారు.

లోఫర్ సినిమా విడుదలకు ముందే అభిషేక్, సుధీర్‌లు తనను కలిశారని వారి బ్యానర్లో ఐదు సినిమాలు చేసేలా అగ్రిమెంట్ చేసుకుందామన్నారు. అయితే తనతో సినిమా ఒప్పందాల పేరుతో వాళ్లకున్న అప్పుల్ని సైతం తనపై రుద్దే ప్రయత్నం చేశారని పూరి వెల్లడించారు. లోఫర్ సినిమా నైజాం హక్కుల్ని 7.5 కోట్లకు కొన్నామని సుధీర్ చెప్పాడని..కానీ నైజాం హక్కులు 3.4 కోట్లకే అమ్మినట్లు నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారని వెల్లడించారు. వీటన్నింటిని చూస్తే ఎవరు ఎంత డ్రామా ఆడారో అర్థమవుతోందన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.