English | Telugu

ఛార్మితో రిలేషన్.. ఫైనల్ గా ఓపెన్ అయిన పూరి జగన్నాథ్!

ఒకప్పుడు టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. ఇప్పటికీ ఆయనని అభిమానించే వారు ఎందరో ఉంటారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన పూరి.. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నారు. ముఖ్యంగా ఆయన గత రెండు చిత్రాలు 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' దారుణంగా నిరాశపరిచాయి. ప్రజెంట్ విజయ్ సేతుపతితో ఓ ఫిల్మ్ చేస్తున్న పూరి.. దాంతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అభిమానులు కూడా ఆయన కమ్ బ్యాక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే కొంతకాలంగా, పూరి కమ్ బ్యాక్ కోసం ఎంతలా చర్చ జరుగుతుందో.. అదే స్థాయిలో ఆయన రిలేషన్ షిప్ గురించి కూడా చర్చ జరుగుతోంది. (Puri Jagannadh)

ప్రస్తుతం పూరి జగన్నాథ్ వయసు 59 సంవత్సరాలు. 29 ఏళ్ళ క్రితం ఆయనకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూరి తనయుడు ఆకాష్ హీరోగా సినిమాలు కూడా చేస్తున్నారు. అలాంటిది పూరి, కొన్నేళ్లుగా హీరోయిన్ ఛార్మితో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. (Charmy Kaur)

హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఛార్మి.. పదేళ్లుగా నటనకు దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. 2015 లో వచ్చిన 'జ్యోతిలక్ష్మి'తో వీరి ప్రయాణం మొదలైంది. 'రోగ్' నుంచి కంటిన్యూ అవుతోంది. బయట కూడా పూరి-ఛార్మి ఎప్పుడూ కలిసి కనిపిస్తుండటంతో.. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఛార్మి వయసు 38 ఏళ్ళు. ఇంకా పెళ్ళి కాలేదు. దీంతో ఛార్మి ప్రేమలో పూరి మునిగిపోయి, కుటుంబానికి దూరమయ్యారని ప్రచారం జరిగింది. వీరిద్దరూ పెళ్ళి కూడా చేసుకుంటారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ గాసిప్స్ పై ఇంతకాలం సైలెంట్ గా పూరి.. ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఛార్మితో రిలేషన్ పై తాజాగా పూరి స్పందించారు. ఛార్మి తనకు 13 ఏళ్ళ వయసు నుండి తెలుసని, దాదాపు 20 ఏళ్లుగా తమ మధ్య స్నేహం ఉందని తెలిపారు. మా మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, మా మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదని పూరి అన్నారు. ఛార్మి యంగ్.. ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు.. అందుకే ఇలాంటి గాసిప్స్ వస్తున్నాయి. అదే ఛార్మికి 50 ఏళ్ళు ఉంటే, ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యేవా? అని పూరి ప్రశ్నించారు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని, అది శాశ్వతంగా ఉంటుందని పూరి స్పష్టం చేశారు. మరి పూరి ఇచ్చిన ఈ క్లారిటీతోనైనా.. ఇక ఆ రూమర్స్ కి చెక్ పడుతుందేమో చూడాలి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.