Read more!

English | Telugu

"పృధ్వి ఐ ఎ యస్"ఆడియో రిలీజ్

"పృధ్వి ఐ ఎ యస్"ఆడియో రిలీజ్ జరిగింది. వివరాల్లోకి వెళితే రాజేష్ ఫిల్మ్ పతాకంపై, పునీత్ రాజ్ కుమార్ హీరోగా, పార్వతీ మీనన్ హీరోయిన్ గా, జాకబ్ దర్శకత్వంలో కన్నడంలో నిర్మించిన "పృథ్వి" చిత్రాన్ని తెలుగులో "పృధ్వి ఐ ఎ యస్" పేరుతో అనువదిస్తున్నారు. ఏప్రెల్ 24 వ తేదీ ఆదివారం, హోటల్ మారియట్ లో యువ హీరో తనీష్ చేతుల మీదుగా తొలి సి.డి.ని నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ అందుకోగా ఈ చిత్రం ఆడియో విడుదల చేయబడింది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కోసం హెచ్.డి.దేవెగౌడ రావలిసింది, కానీ ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారనీ ఆయన సందేశాన్ని తీసుకొచ్చిన దర్శకులు నీలకంఠ తెలిపారు.

ఇది మైనింగ్ మాఫియాని అడ్డుకున్న ఒక ఐ ఎ యస్ ఆఫీసర్ కథనీ శేఖర్ బాబు అన్నారు. ఒక పాట రాయటానికి పిలిచి అన్ని పాటలూ తనతోనే రాయించారని మనోజ్ అన్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల ఫంక్షన్ లో నీలకంఠ, మనోజ్, జాకబ్, శేఖర్ బాబు, తనీష్ ‍, కాశీ విశ్వనాథ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అతిథులంతా ఈ "పృధ్వి ఐ ఎ యస్" చిత్రం డబ్బింగ్ సినిమాలా ఉండదనీ, స్ట్రైట్ మూవీలా ఉండి ప్రేక్షకులను అలరిస్తుందనీ ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.