English | Telugu

రాజ‌మౌళిపై ప్ర‌భాస్ సీరియ‌స్‌...??

బాహుబ‌లిపై రోజుకో రూమ‌ర్‌, పూట‌కో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మంచో , చెడో అది కూడా సినిమాకి కావ‌ల్సినంత ప్ర‌చారం చేసిపెడుతోంది. ఇప్పుడు మ‌రో హాట్ వార్త టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. అదేంటంటే.. రాజ‌మౌళిపై ప్ర‌భాస్ చాలా కోపంగా ఉన్నాడ‌ట‌. అందుకు బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది.

బాహుబ‌లి పార్ట్ 1లో ప్ర‌భాస్ అప్పీరియ‌న్స్ గంట సేపు కూడా లేద‌ట‌. 2 గంట‌ల 35 నిమిషాల సినిమాలో ప్ర‌భాస్ క‌నిపించేది గంటే అంటే... అభిమానుల హృద‌యాలు త‌ల్ల‌డిల్ల‌క‌మాన‌వు. పైగా ఈ సినిమాలో ప్ర‌భాస్‌ది లేట్ ఎంట్రీ అని తెలుస్తోంది. సినిమా మొద‌లైన అర‌గంట వ‌రకూ ప్ర‌భాస్ క‌నిపించ‌డ‌ని చెప్పుకొంటున్నారు.

ఫ్లాష్ బ్యాక్‌, ఛైల్డ్ ఎపిసోడ్ల‌కే అర‌గంట కేటాయించార‌ట‌. ''మిర్చి త‌ర‌వాత నేను నా ఫ్యాన్స్ కి క‌నిపించి రెండేళ్లు దాటింది. `బాహుబ‌లి`పై వాళ్లు చాలా ఆశ‌లు పెట్టుకొన్నారు. వాళ్ల‌కు సంతృప్తిప‌ర‌చ‌క‌పోతే.. ఆ ప్ర‌భావం సినిమాపై ప‌డుతుంది'' అని రాజ‌మౌళికి సర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌. అందుకే ఇప్పుడు పార్ట్ 2లోకి కీల‌క‌మైన ఎపిసోడ్‌ని పార్ట్ 1లోకి మార్చి.. ప్ర‌భాస్ పాత్ర నిడివి ఇంకాస్త‌పెంచాల‌ని రాజ‌మౌళి ప్లాన్ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో బాహుబ‌లి స్ర్కీన్ ప్లే కాస్త మారుతుంది. ఆ ప్ర‌భావం సినిమాపై ఎంత ఉంటుంద‌నే విష‌యంపై రాజ‌మౌళి సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్టు వినికిడి. మొత్తానికి రాజ‌మౌళి ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. అవుట్ పుట్ అటు ప్ర‌భాస్‌నీ, ఇటు ఆయ‌న‌ఫ్యాన్స్‌నీ సంతృప్తిప‌రిచేలా ఉండాలి క‌దా... మ‌రి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.