English | Telugu

ప్ర‌భాస్‌ని.. బాహుబ‌లి వ‌ద‌లట్లేదు!

దాదాపు రెండున్న‌ర సంవ‌త్స‌రాలు బాహుబ‌లితోనే గ‌డిపేశాడు ప్ర‌భాస్. ఇప్పుడు ఆ సినిమా ముందుకొస్తోంది. బాహుబ‌లి వ‌ల్ల‌ రెండేళ్ల పాటు మ‌రే సినిమానీ ఒప్పుకోలేక‌పోయాడు. క‌నీసం క‌థ‌లు కూడా విన‌లేదు. చివ‌రాఖ‌రికి సుజీత్ (ర‌న్ రాజా ర‌న్ ఫేమ్‌) క‌థ‌కి ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందా అనే సందేహాలు నెల‌కొన్నాయి. మేలో ఈ సినిమా ప‌ట్టాలెక్కాల్సింది. కానీ బాహుబ‌లి పూర్తికాక‌పోవ‌డంతో ఆగిపోయింది.

ఇప్పుడు పార్ట్ 1 పూర్త‌యి, విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అయినా.. సుజిత్ సినిమా మొద‌ల‌వ్వ‌లేదు. బాహుబ‌లి జులై 10న విడుద‌ల కానుంది. ఆ త‌ర‌వాతే.. సుజిత్ సినిమా కొబ్బ‌రికాయ్ కొట్టుకొంటుంద‌నుకొన్నారు. ఇప్పుడు ఆ అవ‌కాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే.. బాహుబ‌లి పార్ట్ 2లో ఇంకా 30 శాతం షూటింగ్ మిగిలి ఉంది. ''పార్ట్ 2 షూటింగ్ పూర్తిచేశాకే... కొత్త సినిమా ఒప్పుకో....'' అని ప్ర‌భాస్ ని రాజ‌మౌళి బ‌ల‌వంతం చేస్తున్నాడ‌ట‌. అయితే ప్ర‌భాస్ మాత్రం.. 'బాహుబ‌లి 1 రిజ‌ల్ట్ బ‌ట్టి ఆలోచిద్దాం' అంటున్నాడట‌.


ఒక‌వేళ బాహుబ‌లి ఊహించిన రీతిలోనే రికార్డులు బ‌ద్ద‌లుకొట్టే చిత్ర‌మైతే, అదే ఊపులో 2 కూడా పూర్తి చేద్దామ‌నుకొంటున్నాడు ప్ర‌భాస్‌. అనుకొన్న అంచ‌నాల్ని అందుకోక‌పోతే మాత్రం.. బాహుబ‌లి 2కి కొంత బ్రేక్ ఇచ్చి ఈలోగా ఓ సినిమా పూర్తిచేద్దామ‌ని భావిస్తున్నాడు. ప్ర‌భాస్‌కొత్త సినిమా ఎప్పుడు అనేది ... బాహుబ‌లి 1 రిజ‌ల్టే నిర్ణ‌యించాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.