English | Telugu

బిర్యానీతో ఫ్లాట్ చేసిన ప్ర‌భాస్‌

ప్ర‌భాస్‌ని అంద‌రూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. మ‌న హీరోలే కాదు... త‌మిళ తంబీల‌కూ త‌ను డార్లింగే. త‌మిళ స్టార్ క‌థానాయ‌కుడు సూర్య‌కీ ప్ర‌భాస్ అంటే విప‌రీత‌మైన అభిమానం. ఇద్ద‌రి మ‌ధ్యా చాలా కాలం నుంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ స్నేహంతోనే సూర్య సినిమా రాక్ష‌సుడు ఆడియో వేడుక‌కు ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. అతిథి అంటే గుర్తొచ్చింది.. అతిథి మ‌ర్యాద‌ల విష‌యంలో ప్ర‌భాస్ రూటే సెప‌రేటు. భీమ‌వ‌రం బ్యాచీ క‌దా.. ఆ విష‌యంలో ఏమాత్రం లోటు చేయడు. సూర్య‌కీ త‌న అతిథి మ‌ర్యాద‌ల్ని చూపించాడు ప్ర‌భాస్‌. ఓసారి ఇద్ద‌రి షూటింగ్ ప‌క్క ప‌క్క‌నే జ‌రుగుతోంద‌ట‌. ఆ స‌మ‌యంలో రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ సూర్య కోసం ప్ర‌భాస్ ఎదురుచూస్తూ కూర్చున్నాడ‌ట‌. లేట్ నైట్ సూర్య షూటింగ్ ఫినిష్ చేసుకొని రాగానే.. ఇంటి నుంచి తీసుకొచ్చిన మిక్స్‌డ్ బిర్యానీ వేడి వేడిగా వ‌డ్డించాడ‌ట‌. ఆ టేస్ట్‌కి సూర్య ఫ్లాటైపోయాడ‌ట‌. ప్ర‌భాస్ ఆరోజు ప్రేమ‌తో వ‌డ్డించిన బిరియానీ రుచి ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేక‌పోతున్నా అంటున్నాడు సూర్య‌. అలా ఓ బిరియానీ వ‌ల్ల వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డిపోయింద‌న్న‌మాట‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.