English | Telugu

ఎవరు వచ్చిన స్వాగతం : పోసాని

పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ గురించి ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తన అభిప్రాయాన్ని తెలియజేసారు. "గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయన విధి, విధానాలు వ్యక్తిత్వం నాకు నచ్చినాయి కాబట్టి నేను ఆ పార్టీలో చేరి పని చేశాను. అయితే ఆ పార్టీ తీసేసాక ఇక నేను ఏ పార్టీలో కూడా చేరాలని అనుకోవట్లేదు. కేవలం ఓటర్ గా మాత్రమే ఉంటాను. ఇపుడు మాకు సేవా చేయడానికి ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది మాకు మంచి చేయడం. మాకు(ప్రజలకు) సేవా చేయడానికి ఎవరైనా రావచ్చు. పవన్ పార్టీ పెట్టాడు. తన విధి విధానాలు, తన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు నచ్చితే ప్రజలు తప్పక ఆదరిస్తారు. ప్రజలకు ఎవరైతే సేవా చేయగలరో వారికే ప్రజల మద్దతు ఉంటుంది." అని తెలిపారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.