English | Telugu

రెండు తెలుగు తమిళ సినిమాల పోటీ

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల పరిస్థితి వేడివేడిగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు నాలుగు సినిమాలు వస్తున్నాయి. రెండు తెలుగు సినిమా కాగా.. రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు. శివాజీ, అర్చన జంటగా నటించిన "కమలతో నా ప్రయాణం" నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరొకటి తరుణ్, యామి గౌతమి జంటగా నటించిన "యుద్ధం" సినిమా కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే తమిళంలో సూపర్ హిట్టయిన "రాజా రాణి" చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఆర్య, నయనతార, జై, నజ్రియా ప్రధాన పాత్రలలో నటించారు. అదే విధంగా విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రాన్ని తెలుగులో "ధీరుడు" పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మరి ఈ మూడు చిత్రాలు ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.