English | Telugu

ప‌వ‌న్‌... ఈ క‌న్‌ఫ్యూజ‌నేంటి??

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ విష‌యంలో ఇప్ప‌టికే ఎన్నో సందేహాలు అభిమానుల్ని వేధిస్తున్నాయి. అస‌లు ఈ సినిమా అంతా అనుకొంటున్న‌ట్టు ఏప్రిల్ 8న వ‌స్తుందా, రాదా? లేదంటే ఓ రెండు వారాలు వాయిదా ప‌డుతుందా? అనే క‌న్‌ఫ్యూజ‌న్ నెల‌కొంది. నిర్మాత శ‌ర‌త్ మ‌రార్‌.. ఎంత నిబ్బ‌రంగా చెబుతున్నా.. ఈ సినిమా విడుద‌ల ఇంకా డౌటే. ఎందుకంటే మ‌రో ప‌దిహేను రోజుల షూటింగ్ బాకీ ఉంది. ఆర్‌,ఆర్ ఎడిటింగ్ ఇలాంటి ప‌నులున్నాయి. ఆడియో ఫంక్ష‌న్ చేయాలి. సెన్సార్ కోసం సినిమా సిద్ధం చేయాలి. ఇలా ఎన్ని ప‌నులో. ప‌వ‌న్‌కి ఎప్పుడు మూడొస్తుందో, ఎప్పుడు పారిపోతుందో తెలీదు. ఫామ్ హోస్ కి వెళ్లి నాలుగు రోజులు త‌లుపు వేసుకొని కూర్చున్నాడంటే... ఇక అంతే సంగ‌తులు. కాబ‌ట్టి ఏప్రిల్ 8న స‌ర్దార్ సినిమా రావ‌డం ఇంకా డౌటే.

ఇప్పుడు ఆడియో ఫంక్ష‌న్‌పైనా అనుమానాలు నెల‌కొన్నాయి. ఈనెల 20న ఆడియో ఫంక్ష‌న్ జ‌రుగుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. అయితే.. ఈ డేటు ఇంకా ఖ‌రారు కాలేద‌ట‌. 18న‌గానీ 20న గానీ 22న‌గానీ చేసే అవ‌కాశాలున్నాయ‌ట‌. వేదిక విష‌యంలోనూ గంద‌ర‌గోళం నెల‌కొంది. నిజాం కాలేజీలో చేయాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌. గ‌చ్చిబౌలి స్టేడియం నీ ప‌రిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో వేదిక ఏమిట‌న్న‌ది క‌న్‌ఫ్యూజ‌నే. చిరంజీవిని ఫంక్ష‌న్‌ని పిల‌వాలా, లేదంటే... కేవ‌లం స‌ర్దార్ టీమ్ తో కానిచ్చేయాలా?? అనే సందేహాల్లో ఉన్నాడ‌ట ప‌వ‌న్‌. త‌మ్ముడి ఆడియో ఫంక్ష‌న్‌కి అన్న‌య్య చిరంజీవి రావ‌డం బొత్తిగా త‌గ్గిపోయింది. అయితే ఈమ‌ధ్య ఈ అన్నాద‌మ్ములిద్ద‌రూ మ‌ళ్లీ క్లోజ‌య్యారు. ప‌వ‌న్ పిలిస్తే... చిరు వ‌స్తాడు. కానీ.. ప‌వ‌నే పిల‌వాలా, వ‌ద్దా? అనే ఆలోచ‌న‌ల్లో ఉన్నాడ‌ట‌. అలా.. స‌ర్దార్ చుట్టూ అనేక సందేహాలు నెల‌కొన్నాయి. వీటికి ప‌వ‌న్ ఎంత వీలైతే అంత త్వ‌ర‌గా సమాధానాలు వెత‌కాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.