English | Telugu

రేణు దేశాయ్ కు పవన్ హెల్ప్..?

భార్యాభర్తలుగా విడిపోయినా పవన్, రేణుకా దేశాయ్ ల మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. తాజాగా ఆ స్నేహమే రేణుకు సాయం చేసింది. పవన్ కు దూరమైన తర్వాత దర్శకురాలిగా, నిర్మాతగా రేణు తీసిన మరాఠీ సినిమా ఇష్క్ వాలా లవ్. దీన్ని తెలుగులో డబ్ చేసేందుకు ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఏవో కారణాలతో, అది ఇక్కడ విడుదల కాలేదు. ఈ సినిమాలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా చిన్న పాత్రలో నటించాడు. ఆ పాయింట్ తోనే, ఇక్కడ రిలీజ్ చేసి, పవన్ అభిమానుల్ని థియేటర్లకు రప్పించవచ్చు అనుకుంది రేణూ దేశాయ్. కుదరక పోవడంతో ఇప్పుడు ఈ సినిమాను డైరెక్ట్ గా బుల్లితెర మీద రిలీజ్ చేస్తోంది. ప్రముఖ టివీ ఛానల్ ఈటీవీ తమ హక్కుల్ని కొనుగోలు చేసిందని, రేణు దేశాయ్ ప్రకటించింది.

తెలుగులో అసలు రిలీజే కాని సినిమాను ఈటీవీ కొనడమంటే మాటలు కాదు. దీని వెనుక పవన్ చేసిన మాట సాయం ఉందా..? పవన్ తో ఉన్న రామోజీరావుకు ఉన్న సాన్నిహిత్యమే, సినిమాను కొనేలా చేసిందా..? ఇవీ ఇప్పుడు చాలా మందికి వచ్చిన ప్రశ్నలు..ప్రశ్నల సంగతి పక్కన పెడితే త్వరలోనే తమ అభిమాన హీరో కొడుకును స్మాల్ స్క్రీన్ పై చూడబోతున్నామంటూ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.