English | Telugu

'గోపాల గోపాల' రెస్ట్ తీసుకుంటున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా గోపాల గోపాల మూవీ షూటింగ్ బిజీగా గడిపాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రముఖ భాగం చిత్రీకరణ పూర్తికావడంతో కొన్ని రోజులు విరామం తీసుకోవాలనుకుంటున్నాడు. కామన్ గా పవన్ కళ్యాణ్ ఏదైనా మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే ఫారిన్ కి వెళ్ళి కొంత కాలం అక్కడ విశ్రాంతి తీసుకోవడం ఆయనకి అలవాటు. అయితే ఈసారి రాజకీయాల్లోకి రావడం వల్ల ఇండియాలోనే వుండాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన బెంగుళూరులో రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తెలంగాణ సమగ్ర సర్వేలో కూడా పాల్గొనలేదని సన్నీహితులు అంటున్నారు.మరో వైపు గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్స్ ని మొదలు పెట్టారట. గబ్బర్ సింగ్ 2 కూడా త్వరగా కంప్లీట్ చేసి క్రియాశీల రాజకీయాలలోకి రావాలని పవన్ ఆలోచన.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.