English | Telugu

పవన్ ఫ్యాన్స్, ఆర్జీవీ ట్విట్టర్ యుద్దం.. నిజ రూపం ఇదే.. ఆర్జీవీ


నిరంతరం విమర్శలకు కొలువైన రాంగోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాణ్.. మహేశ్ బాబు ట్విట్టర్ అకౌంట్ పై ఫాలోవర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వర్మకి మధ్య ట్విట్టర్ యుద్దంగా మారింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ప్యాన్స్ కు మండిపోయి వాటికి ధీటుగా రాంగోపాల్ వర్మ మీద కూడా కౌంటర్ ఇచ్చారు. రాంగోపాల్ వర్మ హఠాత్తుగా మరణించాడని.. ఇండస్ట్రీకి పట్టిన పీడ తొలగిపోయిందంటూ ఓ ఇమేజ్ డిజైన్ చేసి దానిని సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది ఆవార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ చివరికి వర్మ వరకు చేరింది. అసలే విమర్సలు చేసే వర్మకు ఈ వార్త విని ఊరుకుంటాడా. తాను కూడా మళ్లీ పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

తాను కావాలనే పవన్ ట్విట్టర్ అకౌంట్ కి.. మహేశ్, సమంత అకౌంట్ కి పోలిక పెట్టానని.. ఈరకంగా అయినా పవన్ కు ఫాలోవర్స్ పెరుతారని అలా చేశానని వ్యాఖ్యానించారు. కానీ పీకే ఫ్యాన్స్ నిజ రూపం ఇదేనని.. పవన్ ఫ్యాన్స్ లో చాలా మంది అనాగరికులు... చదువు రాని వాళ్లు ఉండటం వల్ల తన భావాల్నిఅర్ధం చేసుకోలేక పోయారని ట్విట్ చేసేశాడు. అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి ఇంగ్లీష్ నేర్పించాలని కూడా సూచించారు. అసలే వర్మ మీద ఫల్ ఫైర్ తో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ట్వీట్లకి ఎలా రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.