English | Telugu

స‌ర్దార్‌లో 'కాపు' భ‌జ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో `కాపు` ఫీలింగ్ బ‌లంగాప్ర‌బ‌లుతోంది. ముద్ర‌గ‌డ దీక్ష‌తో... కాపులంతా ఏక‌మ‌య్యారు. త‌మ హ‌క్కుల‌ కోసం చేయీ చేయీ క‌లిపి ఓ ఉద్య‌మాన్ని లేవ‌దీశారు. ఈ ద‌శ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కాపుల‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. `నాకు కావాల్సింది కాపు ఓట్లు కాదు. నేను కాపుల‌కు మాత్ర‌మే నాయ‌కుడ్ని కాదు` అంటూ కాపుల‌ల్లో క‌ల‌వ‌రం సృష్టించాడు. కొన్ని చోట్ల కాపులు ప‌వ‌న్ కి వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు చేశారు. ప‌వ‌న్ ఫ్లెక్సీల‌ను కూడా చింపేశారు. దిష్టి బొమ్మ‌ల్ని ద‌గ్థం చేశారు.

ఇప్పుడు వాళ్లంద‌రినీ మ‌ళ్లీ కూల్ చేసేందుకు ప‌వ‌న్ మ‌ళ్లీ న‌డుం బిగించాడ‌ట‌. త‌న తాజా చిత్రం స‌ర్దార్ - గ‌బ్బ‌ర్ సింగ్‌లో కాపుల‌ను ఉద్దేశించి కొన్ని సంభాష‌ణ‌లు ప‌లికిన‌ట్టు టాక్‌. ''నేను కాపువాడ్ని.. కాపు కాసేవాడ్ని...'' అంటూ ప‌వ‌న్ ప‌లికే సంభాష‌ణ‌లు సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. `నేను మీవాడినే` అంటూ కాపులను ఉద్దేశించి ప‌వ‌న్ కొన్ని డైలాగులు ప‌లికాడ‌ట‌. ఓ స‌న్నివేశం మొత్తం `కాపు`ల ప్ర‌స్తావ‌న ఉంటుంద‌ని.. డైరెక్ట్‌గా కాక‌పోయినా ఇండైరెక్ట్‌గా ఈ డైలాగుల‌న్నీ వాళ్ల హృద‌యాల‌కు ట‌చ్ అవుతుంద‌ని చెప్పుకొంటున్నారు. మ‌రి ఈ డైలాగులతో కాపులు శాంతిస్తారో లేదో తెలియాలంటే సినిమా వ‌చ్చేంత వ‌ర‌కూ ఆగాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.