English | Telugu

అఖండ 2 కోసం రంగంలోకి దిగిన మిశ్రా సోదరులు.. బాలయ్యకి  దైవం అనుకూలం 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)కి దైవ భాష సంస్కృతం పట్ల ఉన్న పట్టు అపారం. ఈ విషయంలో ఎవరకి డౌట్స్ ఉన్నా, బాలకృష్ణ ఇప్పటి వరకు పాల్గొన్న కొన్ని సినిమా ఫంక్షన్స్ లోను, పబ్లిక్ మీటింగ్స్ లో, ఇంటర్వూస్ లో దైవ భాష సంస్కృతం గురించి చాలా చక్కగా వివరించిన సందర్భాలు ఉన్నాయి. పురాణాలకి సంబంధించిన ఎన్నో శ్లోకాల్ని అవలీలగా కూడా చెప్పగలరు. బహుశా అందుకునేమో అఖండ లో శివుణ్ణి ఆరాధించే అఘోరగా బాలయ్య దైవానికి సంబంధించిన డైలాగ్స్ చెప్తుంటే, థియేటర్స్ లోని ప్రేక్షకులు మొత్తం పూనకంతో ఉగిపోయినంత పని చేసారు.


ఇప్పుడు అఖండ 2(Akhanda 2)కి అంతకు రెట్టింపు పూనకాలతో ఊగనున్నారు. సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు చెప్పడంలో నిపుణులైన పండిట్ శ్రవణ్ మిశ్రా(Pandit Shravan Mishra),పండిట్ అతుల్ మిశ్రా(Pandit atul mishra)సోదర ద్వయాన్ని మేకర్స్ అఖండ 2 కోసం రంగంలోకి దించారు. ఈ మేరకు థమన్(Thaman)అధికారకంగా వెల్లడి చేసాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. అన్న దమ్ములైన శ్రవణ్ మిశ్రా, అతుల్ మిశ్రా సంస్కృత శ్లోకాలని పఠించడంలో నిష్ణాతులు. ఆ రంగంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మందిలో భక్తి భావాన్ని రెట్టింపు చేసారు. సదరు శ్లోకాలని వాళ్ళు గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే మన రోమాలు నిక్కబొడుచుకోవడంతో పాటు ఎంతో తన్మయత్వం చెందుతాం. ఈ ఇద్దరి పేర్ల ముందు పండిట్ అని వచ్చిందంటే ఎంత ప్రతిభావంతులో కూడా అర్ధం చేసుకోవచ్చు. రేపు థియేటర్ లో శివ స్తుతుడైన అఘోర గా బాలయ్య చెప్పబోయే సంస్కృత శ్లోకాలు, ఈ ఇద్దరి నోటి నుంచే రానున్నాయి, మరి అఘోర గా బాలయ్య డైలాగ్ చెప్తేనే థియేటర్ లోని ప్రేక్షకులు మొత్తం శివ తాండవంతో ఊగిపోయారు. మరి రేపు ఈ ఇద్దరి గాత్రంలో బాలయ్య సంసృత పఠనాలు చెప్తు చేసే పెర్ ఫార్మెన్స్ కి, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తోడైతే థియేటర్ లలో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.

ఇక ఈ విషయంతో మేకర్స్ అఖండ 2 ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో చెప్పాల్సిన పని లేదు. బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ 2 ని బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్వని తో కలిసి ఆచంట రామ్, ఆచంట గోపీనాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5 న పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. సంయుక్త మీనన్(Samyutha Menon) కథానాయకి కాగా వర్సటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి(Aadhi Pinisetty)ప్రతినాయకుడుగా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను(Boyapati srinu)ప్రస్తుతం శర వేగంగా చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.