English | Telugu

రాజ‌మౌళికి ఆ అర్హ‌త ఉందా?

ప‌ద్మ‌శ్రీ రాజ‌మౌళి.... ఈ పిలుపు ఇప్పుడు కొత్త కొత్త‌గా వినిపిస్తోంది. నిజానికి రాజ‌మౌళికి ప‌ద్మ‌శ్రీ ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఆఖ‌రికి రాజ‌మౌళి కూడా! తెలుగు సినిమాని మ‌రో లెవిల్‌కి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. బాహుబ‌లితో.. టాలీవుడ్‌ని బాలీవుడ్‌కి పోటీగా నిలిపాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. వ‌రుస విజయాల‌తో బాక్సాఫీసు బొనంజాల‌ను అందించాడు. తెలుగు చిత్ర‌సీమ‌లో ఎవ్వ‌రికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించాడు. ఇదంతా.. రాజ‌మౌళి ఘ‌న‌త‌.. కాద‌న‌లేం. అయిన‌ప్ప‌టికీ ప‌ద్మ‌శ్రీ ఇవ్వ‌డం షాకింగే. రాజ‌మౌళి గొప్పోడే. కానీ కె.విశ్వ‌నాథ్ అంత కాదుగా! శంక‌రాభ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం,స్వాతిముత్యం, స్వ‌యంకృషి.. ఇవ‌న్నీఅద్భుతాలు కాదా..? వీటిలో ఒక్క సినిమా అయినా.. బాహుబ‌లి, మ‌గ‌ధీర‌ల‌కు సాటిరాదా?? రాజ‌మౌళి చేతిలో వ‌య‌సుంది.. జోష్ ఉంది... భ‌విష్య‌త్తులో ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించ‌గ‌ల‌డు. కానీ... కె.విశ్వ‌నాథ్ అలా కాదుగా. ఆయ‌న ప‌నిచేసినంత కాలం చేశారు.. ఇప్పుడు అల‌సిపోయారు. క‌నీసం ఇప్పుడైనా ఆయ‌న్ని గౌర‌వించుకోవాలి క‌దా? టెక్నిక‌ల్ విష‌యాల‌నే ప‌ద్మ‌శ్రీ జ్యూరీ గుర్తించింది అనుకొందాం.

త‌మిళ నాట శంక‌ర్ రాజ‌మౌళి కంటే.. ముందే ఉన్నాడు క‌దా? రాజ‌మౌళి తీసిన‌వ‌న్నీ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు.. కానీ శంక‌ర్ అలా కాదు క‌దా? ఓ సామాజిక నేప‌థ్య‌మున్న క‌థ‌ని.. కొత్త కోణంలో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. అంతెందుకు... రాజ‌మౌళి గురువు.. రాఘ‌వేంద్ర‌రావు మాటేంటి? ఆయ‌న ట‌చ్ చేయ‌ని క‌మ‌ర్షియ‌ల్ కోణం ఉందా? అలాగ‌ని అవే సినిమాలూ తీయ‌లేదు. జ్యోతి, బాబు, దేవ‌త‌.. ఇలా చెద‌ర‌ని జ్ఞాప‌కాల్ని అందించారు. అన్న‌మ‌య్య‌తో భ‌క్తి సాగ‌రంలో ముంచెత్తారు. ఇవ‌న్నీ రాజ‌మౌళి సినిమాల ముందు ఆన‌లేదా? చూస్తుంటే.. అవార్డు జ్యూరీ కూడా బాహుబ‌లి ఫీవ‌ర్‌లోనే ఉన్న‌ట్టు అనిపిస్తోంది. రాఘ‌వేంద్ర‌రావు, కె.విశ్వ‌నాథ్‌... వీళ్లంతా లెజెండ్స్‌. ముందు వీళ్ల‌ని గౌర‌వించుకొన్న త‌ర‌వాతే.. మిగిలిన‌వాళ్లు. ఆ విష‌యం జ్యూరీకి అర్థం కాక‌పోయినా రాజ‌మౌళికి మాత్రం అర్థ‌మైంది. అందుకే.. `ఈ అవార్డుకు నేను స‌రిపోనేమో అనిపిస్తోంది` అంటూ.. నిజాయ‌తీగా మాట్లాడాడు. పోనీలెండి.. ఆ సంగ‌తి రాజ‌మౌళికైనా అర్థ‌మైంది. ఎనీవే.. ప‌ద్మశ్రీ అందుకోబోతున్న ద‌ర్శ‌క ధీర రాజ‌మౌళికి స్పెష‌ల్‌... స్పెష‌ల్ కంగ్రాట్స్‌.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.