English | Telugu

గిన్నిస్ బుక్ లో పద్మభూషణ్ పి.సుశీల..!

ఆమె గొంతు మధురం. ఆమె పాట అమృతం. ఆమె గానం అమోఘం. ఒకటి కాదు, రెండు కాదు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని తన గాన మాధ్యుర్యంతో కట్టిపడేసిన పి.సుశీలమ్మకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు ఇలా దాదాపు అన్ని భారతీయ భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన ఘనత ఈ గానకోకిలకు సొంతం. 1952లో పెట్రా థాయ్ అనే తమిళ సినిమాతో సుశీలమ్మ సినీ ప్రస్థానం మొదలైంది. ఆమె సేవలకు మెచ్చి 2008లో భారత ప్రభుత్వం సుశీలమ్మకు పద్మభూషణ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘపతి వెంకయ్య అవార్డును ఇచ్చి గౌరవించింది.

గానసరస్వతి, కలైమామణి, ఫిల్మ్ ఫేర్ అవార్డు..ఒకటా, రెండా.. లెక్కకు మించి అవార్డులు, రివార్డులు గౌరవాలు ఆమె సొంతమయ్యాయి. ఐదు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాన్ని పొందిన ఈ గాయనీమణి, అత్యధిక సంఖ్యలో సింగిల్స్ (17,695 పాటలు) పాడిన సింగర్ గా ఇప్పుడు గిన్నీస్ బుక్ లో కూడా పేరు సంపాదించుకున్నారు. గాన గంథర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె 1336 డ్యూయెట్స్ ను ఆలపించారు. ఇది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని ఒక రికార్డ్. ఆమె నిండునూరేళ్లు ఆరోగ్యంగా, సంపూర్ణ జీవితాన్ని గడపాలని, మరిన్ని పాటల్ని పాడాలని ప్రతీ తెలుగు సినీ అభిమాని కోరుకుంటున్నాడనడంలో అతిశయోక్తి లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.