English | Telugu

' ఊపిరి ' ఫస్ట్ రివ్యూ (ప్రీ రిలీజ్)

క్యాస్టింగ్ : నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్, జయసుధ
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వంశీ పైడిపల్లి
సంగీతం : గోపీ సుందర్
నిర్మాణం : పివిపి సినిమా

నాగార్జున, కార్తీల మల్టీస్టారర్ కాంబినేషన్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన సినిమా ఊపిరి. ట్రైలర్లతో ఇప్పటికే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఊపిరి మార్చి 25న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే మూవీ టీం, వీలైనంత పబ్లిసిటీతో తెలుగు తమిళ ఇండస్ట్రీలో పాపులారిటీ తీసుకొచ్చేశారు. ట్రైలర్ బట్టి ఫీల్ గుడ్ గా తెరకెక్కి ఉంటుందనే ఫీలింగ్ కలుగుతున్న ఊపిరి, ది ఇంటచిబుల్స్ అనే ఫ్రెంచి మూవీకి రీమేక్. కామెడీ డ్రామా జానర్ లో తెరకెక్కిన ఇంటచిబుల్స్ ఫ్రాన్స్ లో సెకండ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. మరి అలాంటి సినిమాను తెలుగులో ఎలా తెరకెక్కించి ఉంటారో ఓ లుక్కేద్దాం రండి..

జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుండే నాగార్జున పాత్రకు, ఒక కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి నడుము కింది భాగమంతా చచ్చుబడిపోతుంది. ఇలాంటి పాత్రకు నాగార్జున లాంటి స్టార్ ఒప్పుకోవడం సాహసంగానే చెప్పాలి. దొంగతనం కేసులో జైలు జీవితాన్ని గడిపి బయటికొచ్చిన ఒక ఆవారా కుర్రాడి పాత్రలో కార్తీ కనిపిస్తాడు. కుర్చీకే పరిమితమైపోయిన తన జీవితాన్ని కాస్త ఆసక్తికరంగా మార్చే మనిషిని తనకు కేరింగ్ అసిస్టెంట్ గా పెట్టుకోవాలనుకుంటారు నాగార్జున. కార్తీలోని సరదా వ్యక్తిత్వం ఆయనకు నచ్చి, అతన్ని అప్పాయింట్ చేసుకుంటాడు.

కార్తీ జైలుకెళ్లి వచ్చాడని తెలిసినా, స్నేహితుడు(ప్రకాష్ రాజ్) వద్దని చెప్పినా నాగార్జున మాత్రం కార్తీని వదలడు. ఇద్దరికీ అన్నదమ్ముల్లాంటి బంధం ఏర్పడుతుంది. అలాంటిది ఒక సందర్భంలో కార్తీకి నాగార్జునను విడిచి వెళ్లిపోవాల్సి సందర్భం ఏర్పడుతుంది. అలా విడిపోయిన వాళ్లిద్దరూ, తిరిగి ఎలా కలుస్తారు అనే ఎమోషనల్ డ్రామానే బ్యాలెన్స్ కథ. మాతృకలో బిలియనీర్ అసిస్టెంట్ పాత్రకు చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. కానీ ఊపిరిలో తమన్నా పాత్రను మాత్రం మన నేటివిటీకి తగ్గట్టుగా హీరోయిన్ గా, కార్తీతో ప్రేమలో పడే పాత్రగా మలిచారు వంశీ పైడిపల్లి.

కామెడీతో పాటు, సెంటిమెంట్ కు పుష్కలంగా స్కోప్ ఉన్న కథ ఇది. బృందావనం, ఎవడు సినిమాల్లో వంశీలోని ఎమోషనల్ డైరెక్టర్ ఎలా ఉంటాడో కనిపిస్తుంది. ఎమోషన్స్ పండించడం వంశీ బలం. అందుకే ఊపిరిని కూడా అదే విధంగా ఎక్కడా ఫీల్ ను కోల్పోకుండా తెరకెక్కించి ఉంటారనే అనుకోవచ్చు. ఫ్రెంచి సినిమాలో, బిలియనీర్ కు ఒక అమ్మాయితో ప్రేమ చిగురించడం, దానికి ఆనందిస్తూ కార్తీ పాత్ర వెళ్లిపోవడం దగ్గర కథ ముగుస్తుంది. మరి తెలుగు సినిమాకు ఎలాంటి ఎండింగ్ ఇచ్చారనేది ఆసక్తికరం.

నిర్మాణపరంగా క్వాలిటీ ఎలా ఉందో ట్రైలర్లో అర్ధమవుతూనే ఉంది. ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది పివిపి బ్యానర్. గోపీ సుందర్ అందించిన స్వరాలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో, వంశీ పైడిపల్లి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎలా ఉండబోతున్నాయో స్క్రీన్ మీద తేలనుంది.

ఓవరాల్ గా మాతృకను చూసిన తర్వాత ఊపిరి ట్రైలర్ చూస్తే, వంశీ పైడిపల్లి ఇంటచిబుల్స్ ను ఇండియా నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతంగా మార్చాడనే ఫీలింగ్ కలగకమానదు. సినిమా పై పూర్తి రివ్యూ కోసం మాత్రం రేపటి వరకూ ఆగాల్సిందే..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.