English | Telugu

తమిళంలోకి యంగ్ టైగర్ ' టెంపర్ '

ఫ్లాపుల బాటలో ఉన్న ఎన్టీఆర్ ను గట్టెక్కించి, హిట్టు మెట్టు తొక్కేలా చేసింది టెంపర్. ఎన్టీఆర్ ను పూరి చూపించిన విధానం నందమూరి అభిమానుల మన్ననలు అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. ఈ మధ్య వివాదాల్లో నలుగుతున్న తమిళ నటుడు శింబు హీరోగా, తమిళంలో తెరకెక్కబోతోంది. టెంపర్ రైట్స్ ను మైఖేల్ రాయప్పన్ కొన్నాడు. వాలు ఫేం విజయ్ చందర్ డైరెక్షన్లో, శింబు హీరోగా సినిమాను తెరకెక్కించాలని ఆయన ఫిక్సయ్యాడట.

దాదాపు స్క్రిప్ట్ వర్కంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. మహిళలకోసం ఫైట్ చేసే క్యారెక్టర్ కావడంతోనే శింబు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం. ఇప్పటికే తమిళనాట, బీప్ సాంగ్ కారణంగా తనకున్న లేడీ ఫాలోయింగ్ ను కోల్పోయాడు శింబు. టెంపర్ తో మళ్లీ వారందరినీ తన సినిమాలకు రప్పించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు శింబు. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో తమిళ వెర్షన్ లో బిజీగా ఉన్న శింబు, ఆ షూట్ పూర్తవ్వగానే టెంపర్ పై దృష్టి పెట్టబోతున్నాడని సమాచారం. మరి శింబు మళ్లీ వెనుకటి ఫామ్ దొరకబుచ్చుకుంటాడో లేదో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.