English | Telugu

ప్రభాస్ ను కొట్టేసిన ఎన్టీఆర్..?

టెంపర్, నాన్నకు ప్రేమతో విజయాలతో మాంచి ఊపు మీదున్నాడు ఎన్టీఆర్. ' టెంపర్ ' తో ఎన్టీఆర్ గేర్ మారింది. అతని స్టైల్, పెర్ఫామెన్స్ కూడా టెంపర్ నుంచీ కొత్తగా ఉంది. ఇదీ ఊపులో కొరటాల శివ తో కలిసి తారక్ ' జనతా గ్యారేజీ ' స్టార్ట్ చేశాడు. తాజాగా తారక్ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. వరల్డ్ వైడ్ టాలీవుడ్ ను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన బాహుబలి రైట్స్ మాలీవుడ్ కు 3.8 కోట్లకు తీసుకుంటే, ఇప్పుడు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రైట్స్ ఏకంగా 4.5 కోట్ల బారీ విలువకు కొనుక్కున్నారు. దీంతో ఎన్టీఆర్ బాహుబలిని మించి క్రేజ్ సంపాదించుకున్నట్టైంది.

మరింతకీ బాహుబలి లాంటి సినిమా చేసిన ప్రభాస్ ను దాటి అక్కడ ఎన్టీఆర్ సినిమాకు ఇంత క్రేజ్ రావడం వెనుక కారణమేంటా అని చూస్తే, మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్కడి యంగ్ హీరో ముకుందన్, క్రేజీయస్ట్ మళయాళ బ్యూటీ నిత్యా మీనన్, ఈ ముగ్గురూ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా మళయాళంలో సూపర్ క్రేజ్ ఉన్న ముగ్గుర్నీ తన సినిమాలో పెట్టి, ఎన్టీఆర్ మాలీవుడ్ పై కన్నేశాడు..వీరి గురించే జనతాగ్యారేజ్ ఇంత రేటు పలికింది..శ్రీమంతుడుతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.