English | Telugu

మహేష్ ని ఫాలో ఫాలో అంటున్న ఎన్టీఆర్

ఈ సంక్రాంతికి ఎలాగైనా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాలనే కసితో వున్నాడు నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వరుస ఫ్లాప్ ల నుంచి 'టెంపర్' తో కోలుకున్న ఈ చిన్నోడు..నాన్నకు ప్రేమతో సినిమాపై మంచి ధీమాగా వున్నాడు. కానీ అభిమానులలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అతన్ని కొంచెం కలవరపెడుతున్నాయి.

గత కొంతకాలంగా బాబాయితో, నారా వారితో సంబంధాలు అంతంత మాత్రంగానే వుండడంతో... ఏం చేయాలో తోచక గందరగోళ పరిస్థితిలో ఇరుక్కుపోయాడు. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టేక్కడానికి మనోడికి ఓ ఐడియా తట్టింది. దాని కోసం మీడియా సపోర్ట్ ముఖ్యమని భావిస్తున్నాడట.

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే దారిలో వెళ్ళి భారీ విజయాన్ని సాధించాడు. ఎప్పుడూ మీడియాకి కొంచెం దూరంగానే వుండే మహేష్ బాబు నేనొక్కడినే, ఆగడు ఫ్లాప్ ల తరువాత తన స్ట్రాటజీ మార్చుకున్నాడు. శ్రీమంతుడు రిలీజ్ కి ఒక నెల ముందే నుంచే మీడియాతో స్నేహంగా వుండడం మొదలుపెట్టాడు. మీడియా మిత్రులందరికీ అందుబాటులోకి వచ్చాడు. ఫలితంగా శ్రీమంతుడుతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇప్పుడు ఇదే దారిని యంగ్ టైగర్ ఎంచుకున్నాడు. ఈ రోజు మీడియా మిత్రులతో దస్ పల్లా హౌటల్‌లో సమావేశం కాబోతున్నాడు. మరి మహేష్ ని ఫాలో ఫాలో అంటున్న ఎన్టీఆర్ కి హిట్ దక్కుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.