English | Telugu

వీరమల్లు మూవీ పబ్లిక్ కి నచ్చింది..  రివ్యూ రైటర్లకే మెచ్యూరిటీ లేదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మొదటి షో నుంచే మెజారిటీ రివ్యూలు నెగటివ్ గా వచ్చాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేలిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. దీంతో వీరమల్లు మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిలిగింది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు జ్యోతికృష్ణ.. రివ్యూ రైటర్లకు మెచ్యూరిటీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Hari Hara Veera Mallu)

రివ్యూలు అనేది సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతాయని కొందరు మేకర్స్ నమ్ముతుంటారు. అందుకే తమ సినిమాకి నెగటివ్ రివ్యూలు వస్తే.. రకరకాలుగా స్పందిస్తుంటారు. దర్శకుడు జ్యోతికృష్ణ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివ్యూ రైటర్లపై అసహనం వ్యక్తం చేశారు.

"ఇప్పుడు ప్రతి ఒక్కరూ రివ్యూయర్స్ అయిపోయారు. వాళ్ళు సినిమాని సినిమాలా చూడట్లేదు. ఈ సాంగ్ బాగుంది, ఈ ఫైట్ బాగుంది అన్నట్టుగా చూస్తున్నారు. అసలు ఈ కథ ఏంటి? ఎందుకిలా చేశారు? అని చూడట్లేదు. వాళ్లకి అంత మెచ్యూరిటీ లేదు. మేము ఇన్నేళ్లు కష్టపడి ఏదో టైం పాస్ కి సినిమా చేయము కదా. చూసేవాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రావాలి అనిపిస్తుంది. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడం కూడా రావాలి. క్లయిమాక్స్ కమర్షియల్ గా లేదని కొందరు రాశారు. కానీ, పబ్లిక్ కి ఆ క్లయిమాక్స్ నచ్చింది." అని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.