English | Telugu

పక్కలోకి వస్తే నాలుగు అవకాశాలు ఇస్తానని స్టార్ డైరెక్టర్ ఆఫర్ చేసాడు. ఆ డైరెక్టర్ ఇతనే   

'ఈ మాయ పేరేమిటో' అనే మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమకి పరిచయమైన నటి కావ్య థాపర్(kavya thapar)ఆ తర్వాత 'ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2 ,ఈగల్,డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాల్లో నటించి యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించింది.లేటెస్ట్ గా గోపిచంద్(gopi chand)హీరోగా శ్రీను వైట్ల(srinu vaitla)దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వం'(viswam)మూవీలో కూడా కావ్య థాపర్ నటనకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులే పడ్డాయి.

రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ సినిమాల్లోకి రాక ముందు కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కున్నాను.ఒక యాడ్ కోసం ఆడిషన్ కి వెళ్తే ఒక బడా దర్శకుడు నువ్వు యాడ్ కి సెలక్ట్ అవ్వాలంటే నా పక్కలోకి రావాలని, అలా చేస్తే ఇంకో నాలుగు యాడ్స్ కూడా రావడంతో పాటు ఫ్యూచర్ కూడా బాగుంటుందని చెప్పాడు.దాంతో నేను అలాంటి దాన్ని కాదని అక్కడ్నుంచి వచ్చేసాను.ఆ తర్వాత కూడా చాలా రోజులు ఫోన్లు చేసి విసిగించేవాడని చెప్పుకొచ్చింది.

కావ్య థాఫర్ చెప్పిన ఈ మాటలు ఇపుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి.కాకపోతే ఏ ఇండస్ట్రీ ని ఉద్దేశించి ఆ మాట చెప్పిందనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఆమె రెండు తమిళ మూవీలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది.ముంబై కి చెందిన కావ్య థాఫర్ నటి కావడం తన తండ్రి 'కల' అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది.ఈ క్రమంలోనే తను కొంచం సెటిల్ అయ్యాక ఈ విషయాన్నీ బయటపెట్టిందనే మాటలు కూడా సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.