English | Telugu

నిన్న రామ్‌చరణ్‌, నేడు ఎన్టీఆర్‌.. నెట్‌ఫ్లిక్స్‌ టార్గెట్‌ ఏమిటి?

నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ టెడ్‌ సరాండోస్‌ డిసెంబర్‌ 7న మెగాస్టార్‌ ఫ్యామిలీని కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి నివాసానికి వెళ్లి అక్కడ చిరుతోపాటు రామ్‌చరణ్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌లను కలిసి వారితో కాసేపు గడిపారు. డిసెంబర్‌ 8 మధ్యాహ్నం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను అతని నివాసంలోనే కలిశారు టెడ్‌ సరాండోస్‌. నెట్‌ఫ్లిక్స్‌ సీఈవో.. ఎన్టీఆర్‌ని కలిసిన సమయంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కొరటాల శివ ఉన్నారు. ఎన్టీఆర్‌, టెడ్‌ ఇద్దరూ సినిమాలకు సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత టెడ్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులతో కలిసి ఎన్టీఆర్‌ బృందం లంచ్‌ చేశారు

అనంతరం ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘టెడ్‌ని కలవడం, వారి టీమ్‌తో కలిసి లంచ్‌ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది’ అన్నారు. టెడ్‌ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌తో గడిపిన ఈ క్షణాలు మరచిపోలేనివి. మా ఇద్దరి మధ్య సినిమాల గురించి, ఇతర విషయాల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది’ అన్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.