English | Telugu

రోజుకి రెండు కోట్లు అడిగిన హీరోయిన్‌


దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం ఎలాగో మ‌న క‌థానాయిక‌ల‌కు బాగా తెలుసు. ఫామ్‌లో ఉండ‌గానే పారితోషికాల పేరుతో పిండేస్తారు. ఈ విద్యలో న‌య‌న‌తార ఎప్పుడో ఆరితేరిపోయింది. క‌థానాయిక పారితోషికాన్ని సౌత్‌లో కోటి దాటించిన ఘ‌న‌త న‌య‌న‌కే ద‌క్కుతుంది. ఇప్పుడు... ఎండార్స్‌మెంట్ల విష‌యంలోనూ చుక్క‌లు చూపిస్తోంది. ఓ న‌గ‌ల దుకాణానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కోసం న‌య‌న‌తార‌ని సంప్ర‌దించారు. `ఓయ‌న్‌.... యాడ్స్‌లో న‌టించ‌డానికి నాకెలాంటి అభ్యంత‌రం లేదు..` అందట‌. అయితే పారితోషికంగా రోజుకి రెండు కోట్లు ఇస్తే చాలంద‌ట‌. దాంతో.. ఆ న‌గ‌ల దుకాణం వాళ్లు అదిరిప‌డ్డారు. రెండు రోజుల‌కు రూ.4 కోట్లు స‌మ‌ర్పించుకొనే ప‌రిస్థితిలో తాము లేమ‌ని.. న‌య‌న‌కు ఓ దండం పెట్టి వెళ్లిపోయార‌ట‌. ఈ ఉదంతాన్ని త‌మిళ ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.