English | Telugu

నయనతార మతిపోగోడుతోంది

థర్టీ ప్లస్‌లో పడితే హీరోయిన్ల పనైపోయినట్లే అంటుంటారు. కానీ అది పాత కథ. ఇప్పుడు సీన్‌ మారింది. ఏజ్‌ పెరిగే కొద్దీ క్రేజ్‌ పెరిగిపోతోంది చాలామంది హీరోయిన్లకు. హిందీలో కరీనాకపూర్‌, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌ లాంటి హీరోయిన్లు ఇప్పటికే థర్టీప్లస్‌లో పడినా జోరు కొనసాగిస్తున్నారు. సౌత్‌లో థర్టీప్లస్‌ హీరోయిన్ల జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అనుష్క, త్రిష, నయనతార ఒకరిని మించి ఒకరు దూసుకెళ్లిపోతున్నారు. ఐతే అందర్లోకి ఎక్కువ జోరు నయనతారదే. ఆమె ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో కలిపి ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తోంది. విశేషమేంటంటే.. ఈ ఏడు సినిమాలు వచ్చే మూడు నెలల వ్యవధిలో విడుదల కాబోతున్నాయి.నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి నటించిన నన్బేండా ముందు విడుదలవ్వగాగా.. ఆ తర్వాత మమ్ముట్టితో చేసిన భాస్కర్‌ ద రాస్కెల్, సూర్య సరసన నటించిన మాస్‌, తొలిసారి హార్రర్‌ పాత్రలో చేసిన మాయ, మాజీ ప్రియుడు శింబుతో జతకట్టిన ఇదు నమ్మ ఆళు, విజయ్‌ సేతుపతికి తొలిసారి జోడీగా నటించిన నానుమ్‌ రౌడీదా, జయం రవి హీరోగా చేసిన తనీ ఒరువన్‌ ఒకదాని తర్వాత ఒకటి విడుదల కాబోతున్నాయి. సౌత్‌ ఇండియాలో ఓ హీరోయిన్‌ నటించిన ఏడు సినిమాలు ఒకే ఏడాది విడుదలవడమే ఆశ్చర్యం కలిగించే విషయమంటే.. మూడు నెలల వ్యవధిలో ఇవన్నీ ప్రేక్షకుల ముందు రాబోతుండటం ఇంకా పెద్ద విచిత్రం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.