Read more!

English | Telugu

మలేషియాలో చిక్కుకున్న నయనతార

ఈ మధ్య తమిళతారలకు ఎయిర్ పోర్ట్ లు కలిసిరావట్లేదు. రెండ్రోజుల క్రితమే, పాస్ పోర్ట్ మర్చిపోయి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎయిర్ పోర్ట్ లో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. అది కూడా మన దేశంలో కాదు. ఎక్కడో మలేషియాలో. విషయంలోకి వెళ్తే, తాను నటిస్తున్న ఇరు మురుగన్ అనే సినిమా షూటింగ్ కోసం మలేషియా బయలుదేరారు నయన్. ఆమె పాస్ పార్ట్ లో పేరు మిస్ మ్యాచ్ కావడంతో, మలేషియా ఎయిర్ పోర్ట్ అధికారులు, నయన్ ను అక్కడే నిలిపేశారట. దాంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ, నయన్ ఎయిర్ పోర్ట్ లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న ఇరు మురుగన్ లో నయన్ ది ఒక అండర్ కవర్ ఏజంట్ పాత్ర. దీని కోసం ఆమె కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల్లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. నిత్యామీనన్ మరో ప్రధాన పాత్రలో కనిపించబోతోంది.