English | Telugu

ఫిష్ వెంకట్ కి సాయం చేయకపోవడంపై నట్టికుమార్ కామెంట్స్   

ప్రముఖ నటుడు 'ఫిష్ వెంకట్'(Fish Venkat)రెండు రోజుల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఫిష్ వెంకట్ కూతురు మాట్లాడుతు 'కిడ్నీ మార్పిడికి కావాల్సినంత డబ్బులు ఉంటే, మా నాన్న బతికే వాడని, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు సాయం చెయ్యలేదని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా కూడా సినీ రంగానికి సంబంధించిన పెద్ద నటులు, టెక్నీషియన్స్ చనిపోతే అందరు వెళ్తారు. కానీ ఫిష్ వెంకట్ చనిపోతే మాత్రం ఎవరు రాలేదనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

ఈ మొత్తం విషయంపై ప్రముఖ నిర్మాత 'నట్టికుమార్'(Natti Kumar)మాట్లాడుతు ఫిష్ వెంకట్ సినిమాల్లో నటించకుండా చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అందుకే ఆయనతో ఎవరు టచ్ లో లేరు. సినిమారంగం చాలా బిజీ రంగం కావడంతో హీరో, నిర్మాత, డైరెక్టర్స్ క్షణం కూడా తీరిక లేకుండా ఉంటారు. వెంకట్ కి సాయం చెయ్యాలని సోషల్ మీడియా వేదికగా చాలా మంది కోరారు. కానీ ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో మెంబర్ షిప్ కూడా తీసుకోలేదు. ఇండస్ట్రీలో ఎవరి బతుకులు వారివి. ఖచ్చితంగా హీరోలు సాయం చెయ్యాలని రూల్ లేదు.

వెంకట్ గారు రోజుకి మూడు వందల నుంచి ముప్పై వేలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. దాన్ని జాగ్రతగా కాపాడుకుంటే బాగుండేది. నా మాటలు ఫిష్ వెంకట్ కుటుంబానికి బాధ కలిగించవచ్చు. అనవసరంగా డబ్బు వృధా చేసుకోకూడదు. రేపు నేను చనిపోయినా డబ్బు లేకపోతే ఇదే పరిస్థితి. నేను ఎవరితో టచ్ లో ఉంటే వాళ్ళే నా ఇంటికి వస్తారని నట్టికుమార్ చెప్పుకొచ్చాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.