English | Telugu

ఆమె చేసిన పనికి అంతమంది బుక్కైపోయారు..!

బాలీవుడ్ యాక్ట్రెస్ నర్గీస్ ఫక్రి, నిర్మాత ఉదయ్ చోప్రాలు డేటింగ్ లో ఉన్నారని చాలా కాలంగా బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇద్దరికీ మధ్య కెమిస్ట్రీ నడుస్తున్నా, ఎప్పుడూ పబ్లిగ్గా ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుందామని ఉదయ్ అడిగినా వరస సినిమాలుండటంతో నర్గీస్ ఒప్పుకోలేదట. సడెన్ గా ఏమైందో ఏమో, ఇప్పుడు పెళ్లి చేసుకుందామని నర్గీస్ అడిగితే ఉదయ్ వద్దన్నాడట. దీంతో, ఇద్దరికీ గొడవ పెద్దదై, నర్గీస్ ఫ్లైట్ బుక్ చేసుకుని అమెరికా వెళ్లిపోయిందట. ప్రస్తుతం ఆమె నటించిన అజహర్, హౌస్ ఫుల్ 3 ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో, నిర్మాతలు నెత్తి మీద టవల్ వేసుకున్నారట. మరో వైపు నర్గీస్ మేనేజర్ మాత్రం ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదని నిర్మాతలకు చెప్పే ఫారిన్ కు వెళ్లిందని, నెల రోజుల రెస్ట్ తర్వాత తిరిగొస్తుందని చెబుతున్నాడు. అతను చెప్పిన దాని కంటే, ముందు వచ్చిన రూమర్ కే బాలీవుడ్ జనాలు ఎక్కు ప్రాధాన్యతనిస్తున్నారు. మేనేజర్ ఎంత చెబుతున్నా, ఉదయ్ తో గొడవ వల్లే ఆమె న్యూయార్క్ వెళ్లిందని బాలీవుడ్ ఫిక్సైపోయింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.