English | Telugu

నందిని రెడ్డి మళ్ళీ కాపీ కొట్టేసిందా..?

టాలీవుడ్ లో గత కొంతకాలంగా సద్దుమణిగిన కథల కాపీ గోల మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం టాప్ పొజిషన్ అనుభవిస్తున్న డైరెక్టర్లంతా గతంలో ఈ కాపీ గోలను ఎదుర్కున్నవారే. వారిలో కొంతమంది కథలకు పరిహారం చెల్లించగా, మరికొంతమందిపై ఆరోపణలు నిరూపితం కాలేకపోయాయి. అయితే తాజాగా హనుమాన్ అనే కొత్త దర్శకుడు మంచు విష్ణుకు ఓ స్టొరీ వినిపించి గ్రీన్ సిగ్నల్ సాధించాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళాల్సివుండగా, సడన్ ఇతను రచయితల సంఘంలో తన కథను నందిని రెడ్డి అనే దర్శకురాలు కొట్టేసి, సినిమా తీయడానికి రెడీ అవుతుందని ఫిర్యాదు చేశాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే నందిని రెడ్డి సినిమాను నిర్మించే నిర్మాతకు ఇతను గతంలోనే ఈ కథను వినిపించాడట. అయితే నందిని రెడ్డి మాత్రం ఈ కథతో హనుమాన్ కి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ విషయం దాసరి దగ్గరకి వెళ్ళిందట. అలాగే నందిని రెడ్డి గతంలో తన జబర్దస్త్’ సినిమాని ఓ హిందీ సినిమాని మక్కీకి మక్కీ కాపీకొట్టిన విషయం ఇండస్ట్రీ వర్గాలకు తెలిసిందే. సదరు సినిమా నిర్మాత కేసు వేయడంతో భారీగా పరిహారం చెల్లించారని కూడా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆమె మరోసారి ‘కాపీ’ ఉదంతంతో వార్తల్లోకి వచ్చారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.